పుట:AntuVyadhulu.djvu/137

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

పదునొకండవ ప్రకరణము


చింతపండుయొక్క పులుపును విరుచుటకు తులము ఉప్పు సరిగానుండునని మన మూహించినయెడల 10 తులముల చింత పండునకు పదితులముల యుప్పు సరిగానుండును. కాని పది తులముల టీకారసమును పది తులముల ధనుర్వాయు విషమునుజేర్చి యొకజంతువులోని కెక్కించగా నాజంతువు మూడు దినములలో చచ్చెను. అదే మిశ్రపదార్థమును రెండు గంటల సేపు నిలువయుంచి పిమ్మట అదేతూనికగల జంతువులోని కెక్కించినప్పుడు దానికేమియు విషమెక్కలేదు. ఇదిగాక అదేతూనికల మరియొక జంతువులోనికి రెండు లక్షల తులముల టీకారసమును రెండులక్షల తులముల విషమును చేర్చి పిచికారీ చేసిప్పుడు ఆ జంతువున కేమియు రోగము రాలేదు. కావున సంయోగము ఉప్పు చింతపండులయొక్క సంయోగము వంటిదికాదు.

ఈ విరుగుడు పదార్థములయొక్క స్వభావమును తెలియపరచుటకు ఎర్లికు వాదములనియు, మెచ్ని కాపు వాదములనియు కొన్నివాదములు గలవు. వాని నన్నిటిని నిక్కడ వివరించుటకు ఎడములేదు. కాని సూక్ష్మజీవులు మనశరీరములో ప్రవేశించినతరువాత ఎంత శీఘ్రముగ విరుగుడు పదార్థములను ప్రవేశపెట్టిన అంత మంచిదని చెప్పవలసియున్నది. ఆలస్యమైనయెడల శరీరమునందలి విషపదార్థములు మిక్కిలి అధి