పుట:AntuVyadhulu.djvu/129

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

106

పదియవ ప్రకరణము


ఈ క్రింది సంఖ్యలవలన ఈ విషయము స్పష్టముకాగలదు. 1902 మొదలు 1942 వరకు గల కాలములో 14,730 కుక్కలును 2,491 నక్కలును, 140 గుర్రములు, 78 పిల్లులును, 71 తోడేళ్లును, 16 పశువులును, 79 మనుష్యులును కరచుటవలన వెర్రికలిగినది. దీనినిబట్టి కుక్కలే యీ వ్యాధికి ముఖ్యకారణములని తెలియగలదు. మన రాజధానిలో వెర్రికుక్క కాటుకు చికిత్సచేయు ఔషధశాల కూనూరునందు కలదు. ఈ క్రింది 33-వ పటము జూడుము. అక్కడకు పోవు

33-వ పటము.

పాస్టరుపేరటనున్న వెర్రికుక్క కాటునకు వైద్యశాల.
(కూనూర్, నీలగిరిజిల్లా,)

వారలు తాలూకా మేజస్ట్రీటునకుగాని డిష్ట్రిక్టు సర్జనునకుగాని తమ యభిప్రాయమును తెలిసినయెడల వారు రోగులకు రైలు చార్జి వగయిరాలిచ్చి సదుపాయములన్నియు జెప్పుదురు.