పుట:Andhraveerulupar025903mbp.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యాచశూరుడు

ఆంధ్రవీరులలో వెలమవారగు రేచర్లగోత్రీయులు సుప్రసిద్ధులు. భేతాళనాయకుడు, అనపోతనాయకుడు, సర్వజ్ఞసింగభూపాలుడు మున్నగు వెలమవీరులందఱు నీ రేచర్లగోత్ర సంజాతులె. రేచర్లగోత్రీయులు తొలుత కాకతీయసామ్రాజ్యమున సేనానాయకులుగ నుండి యప్రతిమాన పరాక్రమముటొ సంగరములలో జయముగడించి తమప్రభువులచే సత్కారముల నొందిరి. కాకతీయసామ్రాజ్యము పడిపోయిన పిదప నీ వెలమవీరులు స్వతంత్ర రాజ్యములను స్థాపించి చిరకాలము పాలించిరి. అనంతర మీరాజ్యము యవనుల యొత్తిడిచే రానురాను జీలి భిన్నభిన్నమైపోయెను. ఈరేచర్ల గోత్రము నందు జనించిన యాచశూరుడు చంద్రగిరి వీరవేంకటపతిరాయలు పాలించుతఱి కొంతకాలము మధురాంతకమునందును మఱికొంత కాలము ఉత్తరమల్లూరునందును సామంతరాజుగా నుండి స్వామిభక్తివిశేషమున బేరెన్నిక గాంచెను.

విద్యానగర సామ్రాజ్యము పతనము కాగానే తిరుమలరాయలు పెనుగొండ జేరినటుల మన మెఱింగియున్నారము. అక్కడగూడ విరోధులవలని యొత్తిడి తగ్గకపోవుటచే జంద్రగిరి చేరెను. ప్రకృత కథాకాలమున దిరుమలరాయని తనయుడగు వీర వేంకటపతిరాయలు చంద్రగిరి రాజ్యమును