Jump to content

పుట:Akasavani vol 1 sept 1912.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

దౌ పదీ దేవి చరిత్రము .


ధృష్టద్యుమ్నుడు పరాక మవంతుడై ధనుర్విద్య మొదలగు విద్యల వెల్ల వభ్యసించు చుండెను. ద్రౌపదీయు నన్నతో సమముగా సకలవిద్యలను గ్రహించుచుండెను. ఆ చిన్నది బహుబుద్ధిమంతురాలు, గుణవతి. సౌందర్యవతి. ఆమె తనరూపగుణ సంపదల చే తనను కన్న వారిని నానండపరుచుచుండెను. ఆమెను విన్న రాకుమారులెల్ల తమకు భాగ్య యైన బాగుండునని తలంచి యుఖ్వళ్ళూరుచుండిరి. క్రమముగా నామెకు నెల్ల విద్యల తోడను యౌవనము కూడ వచ్చెను. ఆమె రూపముద్విగుణమయ్యెను. వినయము నయము మొదలగు సుగుణపుంజమును హెచ్చెను. కోకిలయు ద్రుపదుడును కుమార్తె వివాహము నిమిత్త మై యాలోచింపసాగిఖీ. దుపదుడు శాతవంతుడు. రాజకులభూ పణుడు. యోధాగేపరుడు. కోకిలమ్మయు గుణవంతురాలు. గలది. అందుల్ల నిరువురును చాల నాలోచించి యుక్త మక్షత్రియ పుత్రుడై వీరాధి వీరుడైన రాకుమారునకిచ్చి వివాహము చేయవలయునని నిశ్చయించిరి. మంచియాలోచన

అంతకు పూర్వమే యొక నాడు పాండవులలో నొకడైన యర్జునుండు గురుని యానతి చొప్పున దుపదుని మీదికి దండెత్తి వచ్చి యాతని నోడించి పరాభవపరచెను. ఆసమయమున దుపదునకు నర్జునునిశక్తియు శాగ్యమును బాహుబలమును బుద్ధికుశలతయు తేట తెల్లములయ్యెను. ద్రుపదుడు పార్థుని సంక్రమమును చవిచూచిననాట నుండియు నాశ్చర్యమునొందుచు నకనియందు వైరము కలిగియుండుటకు మారుగా పేసుకలిగి యుండెను. అర్జునునిగుణము లనేక పర్యాయములు భార్యవర్ధను మిత్రులవద్దను పొగడుచు ముచ్చటపడుచుండెను. యోగ్యులగువారికి లక్షణమిదియేకదా! ధనంజయుని విజయవి శేషంబులు వినుచున్న కొలందిని కోకిలాంఒకును సరనికే తనకూతు నీయవలయునని కోరిక లుకముందుమఁ డెను. దౌపరియు నట్టి జగ పెట్టి తన్ను చేపట్టు భాగ్యము కలుగునాయని యున్వీశులూరుచుండెను. ధృష్టద్యుమ్నునకును నిదియే యిష్టముగా కానీ యని నెరవేరక వారిమనంబులకు వ్యాకులము కలిగెను.

ఇప్పుడు ఢిల్లీయని పిలువబడు హస్తి నాపురమును కురువంశ రాజు లాకాలమున పాలించుచుండిరి. ఆరాజ్యమున కధికారియగు ధృతరాష్ట్రమహారాజునకు పాండు రాజు విదురుడు ననుసోదరు లిరువురు కలరు. ధృతరాష్ట్రుని భార్య పేరు గాంధారీ దేవి. ఆమె మహాపతివ్రాత. ఆదంపతులకు దుర్యోధనాదులు నూరుగురు కుమారులును దుస్సలయను కూతురును గలిగెE. పాండురాజునకు కుంతి, మాది యను నిద్దరు భార్యలు. కుంతి