పుట:Aandhrakavula-charitramu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పెద్దయామాత్యుఁడు

ఇతనింగూర్చి "తెనుఁగు కవుల చరిత్ర"లో వ్రాయఁబడినది. తెలుఁగు కవులలో పెద్దయలు పెక్కురు కలరు. ఇతఁడు విక్రమార్కచరిత్రమును రచించిన జక్కనకు పితామహుఁడు నెల్లూరిని పాలించిన మనుమసిద్ది రాజునకు దండ్రియగు చోళ తిక్కరాజు కాలమున నున్నట్లు జక్కన చెప్పిన "...నెల్లూరి తిరుకాళ మనుజవిభుని, సమ్ముఖమ్మున సాహిత్యసరణి మెఱసి" అను పద్యభాగమువలననే తెలియుచున్నది. తిక్కరాజే తిరుక్కాళత్తి యని శ్రీ వేంకటరావుగారు తెలిపిరి. కావున నీకవి క్రీ.శ. 1208 - 1230 నడుమ నుండెనని చెప్పవచ్చును.

పెద్దయామాత్యుని గ్రంథములు లభింపలేదు. ఇతఁడు "ఆశు-మధుర-చిత్ర-విస్తరము"లను చతుర్విధ కవిత్వములందు నాఱితేఱినవాఁడు.