పుట:2030020025431 - chitra leikhanamu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చిత్రలేఖనము.

BOOK 1.

ప్రథమభాగము.

మొదటి ప్రకరణము.

బాలురు చిత్రలేఖనమునందు మిగుల శ్రద్ధ వహించెదరు ; కాని వీరియం దీగుణమును వృద్ధి పొందించుటకు పెద్దలేమియు ప్రయత్నింపలేదు. దీనిని వృద్ధి పొందించిన యెడల మనదేశములో చాలమంది చిత్రలేఖకులు వెలువడెదరు.

చిత్రలేఖన మనేక విధముల బరగుచుండును. పెన్సిలు, కణిక (Crayon), మసిబొగ్గు, రంగులు, కుంచెలు, కలము మొదలగునవి యుపయోగించి చిత్రములను వ్రాయవచ్చును. కాగితమును బొమ్మరూపముగ కత్తిరింప వచ్చును. మట్టితో ప్రతిమలను చేయవచ్చును. రాతిమీదను బొమ్మలను చెక్కవచ్చును.

మనస్సున పుట్టిన యుద్దేశమును మనము పైని చెప్పిన పరికరముల నుపయోగించి పైకి కనపఱుపవచ్చును. పిల్లి చాపమీదను పండుకొనియున్నట్లు మన మనస్సునం దూహించి దానిని కాగితము మీద పెన్సిలుతో వ్రాయవచ్చును. రంగుతో చిత్రింపగలము. కత్తెరతో కాగితమును కత్తిరింపవచ్చును. కత్తితో కఱ్ఱమీదను చెక్కవచ్చును.

బాలురకు నేర్పించుటయందు పెన్సిలును, రంగులను, సాధారణముగ నుపయోగించెదరు.

ఒక బొమ్మను చుచి వ్రాయుట చాల చెడ్డది. దీనికి బదులు నిజమైన వస్తువును బాలుని చేతికిచ్చి వ్రాయించుట మంచిది.

చేయి మనస్సు యొక్క నౌకరి. అందువలన మనసున పుట్టిన యుద్దేశమునే వ్రాయించుట యుత్తమము.

ఈ దిగువ నుదహరించిన ప్రకారము బాలురకు నేర్పిన చాల మంచిది. బాలు రాడుకొనునటుల వ్రాయించిన వారి కత్యానందము కలుగును. చిత్రలేఖనమునం దభిరుచి కలుగును.

ఈ చిత్రములయందు బాలురకును పెద్దవాండ్రకును భేదము తలనుబట్టి తెలియును. బాలురకు దేహమును పట్టిచూడా శిరస్సు పెద్దదిగనుండును. పెద్దవారికి చిన్నదిగ నుండును.

ఇం దభ్యాసమైన తర్వాత మనుజు లేదైన పనిని చేయుచున్నటుల వ్రాయింపవలయును.