పుట:2015.391574.BHAKTIRASA-SHATAKA.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

భక్తిరసశతకసంపుటము


సీ.

భాగవతంబునఁ బాక్షికుఁడై కవి
                    వాస్తవంబులు గొన్ని వదలినాఁడు
పెక్కులేటికి లెక్క బెట్ట వ్యర్థపుశ్రమ
                    నొక్కటి నుడివెదఁ జక్కి గనుఁడు
దక్షాధ్వరంబుకు దనుజారి వచ్చిన
                    లేదని జెప్పెను గాదు నిజము
వేదమం దీకథ విరళమైయున్నది
                    వేగియై వీరుండు విష్ణుశిరము


గీ.

వెఱచి యాహవనీయాగ్ని వేసె ననుచు
శ్రుతియు బలుకుటఁ బోతన చూడఁడేమొ
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...

122


సీ.

పద్మాక్షుఁ డొకతరి పద్మాక్షియై సుధా
                    భాగనిర్ణయముకు భారపడియె
విష్ణుప్రకృతి భగవిధము రూపంబని
                    వేదాగమంబుల వినఁగవచ్చు
శివుఁడు పురుషుండని చెప్పెను శ్రుతులన్ని
                    ప్రకృతియుఁ బురుషులు భావశుద్ధి
గన నభేదులు భేదగతులునై తోతురు
                    మాన్యమోహినికిని మగఁడ వీవె


గీ.

కాన ని న్నభిలషించిన గలిగెఁ గొడుకు
కూఁతు రామోహినికి వారు గుఱుతు గారె
భావభవభంగ గౌరిహృత్పద్మభృంగ
రాజిత...

123


సీ,

మోహినీదేవికి మొదటిబిడ్డండయ్యె
                    భైరవుం డతఁ డీశ భవనములకుఁ