పుట:2015.390519.Shashamka-Vijayamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

127


గీ.

ఘంట నాడించినవితాన గండుతేటి
మొఱయుచందాన జలధర ముఱుమురీతి
యుజిమి గీచినభాతి నై యుత్పలాప్తు
నారి రణమున మ్రోసె నాదార కపుడు.

53


సీ.

అసువు లాసింపనివసువుల నెనమండ్ర
        నసదృశాంబకములపస యణంచి
యద్రుగలతి మీఱురుద్రుల బాణస
        ముద్రమగ్నులఁ జేసి రౌద్ర ముడిపి
తద్ద రాజిల్లుపన్నిద్దరాదిత్యుల
        వద్దఁ జేరక మున్నె సద్దు మాన్పి
కత్తులు పూని యున్మత్తులై వచ్చుమ
        రుత్తుల సముదగ్రవృత్తిఁ బాపి


గీ.

మఱియు గంధర్వకిన్నరగరుడసిద్ధ
సాధ్యచారణయక్షభుజంగపతులు
చండగాండీవముక్తాస్త్రసమితి ముంచి
లీలఁ బఱపెను బంచబంగాళముగను.

54


ఉ.

ఏచి జయంతుఁ డయ్యెడ నహీనశరంబులఁ జంద్రు నొంచినన్
బూచినమోదుగం దలఁపఁ బోలి యతం డలుకన్ శచీసుతుం
జూచి తృణీకరించి నగుచున్ వడి చన్మఱయందు నుగ్రనా
రాచము నాటి వ్రాల్చెను ధరాస్థలి శుక్రుఁడు మెచ్చి యార్వఁగన్.

55


ఉ.

అంత జయంతుపాటు హృదయం బెరియింప నిలింపభర్త చౌ
దంతిని డిగ్గి కాంచనరథం బధిరోహణ చేసి రోషదు
ర్దాంతత మాతలిం గని సుధాకరుపై మనతేరుఁ బోపవని
మ్మింతట చంద్రుఁ డయ్యెడిని నింద్రుడు నయ్యెడి నిజ్జగంబులన్.

56


క.

అని పల్క ననిమిషేంద్రుని
మనమువలెన్ రయము మెఱయ మాతలి రథమున్
జనఁ జేయఁ జంద్రుసారథి
యును రథ మభిముఖము చేసె నురువడి మీఱన్.

57


ఉ.

ఇద్దఱు నప్రమేయబలు లిద్దఱు నేర్పరు లస్త్రవిద్యచే
నిద్దఱు నుగ్రసాహసికు లిద్దఱు నక్షయబాణశోభితు