పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వితీయాశ్వాసము.

81


నొప్పు మిగుల నడచి యొడ్డాదిమీఁదుఁగా
బోయి దేవులపలిపొంతఁ దిగిరి.

163


చ.

మనసరిహద్దునన్ ముసలిమానుఁడు రాకొమరుండు బూసియున్
మొనకొన వచ్చి డిగ్గి రను ముచ్చట లందెను రావుగారి క
య్యనుపమధైర్యుఁ డప్పుడు రయంబు మెయిం జెలికానివంశజున్
ఘనయశు వెంకభూధవశిఖామణి నంపఁదలంపు వేడుకన్.

164


ఉ.

పోడిమి మీఱ రాముఁ డనుపూరుషుఁ జిట్టెలవంశజుం గడుం
దోడుగఁ గూర్చి సమ్మదముతోఁ దగు నుత్తరము ల్రచించి యా
ఱేఁ డనిచెం బ్రతాపవిధురీకృతసర్వదిగంతవైరిస
మ్రాడుదయున్ దయామయు సమగ్రయశోహరిణాంకు వెంకయన్.

165


చ.

అతఁడును నేగి యయ్యవనునానతిఁ గట్టెదుట న్నిషణ్ణుఁడై
హితము నయమ్మ దోఁపఁగ నొకించుక కొంచక యుగ్గడించుచో
నతఁడును గోపఘూర్ణితహృదంతరుఁడై నడపె న్వెస న్భవ
త్క్షితిపతికోటఁ దా వెడలి శీఘ్రమె పోయెనొ లేదొ నావుడున్.

166


ఉ.

హైదరుజంగుతో ననియె నప్పుడు వెంకనృపాలమౌళియు
న్మాదొరగా రొకింత యనుమానము లేక కృపార్ద్రమైన మీ
యాదరణ న్మొలాజుమతుకై చను దేరఁ దలంచినాఁడు న
మ్మోదముచేత రమ్మనెడి ముఖ్యముగాఁ దమకౌలు వచ్చినన్.

167


తే.

వచ్చినయనంతరమ్మున వారు తమరు
గలసి ముచ్చటలాడెడు గారవమున
వ్యగ్రత యనంగ రాక విూవచనసరణి
నడపఁగలవాఁ డతం డని నుడువుటయును.

168