పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

65


ఘనునిం బంతెనవంశ్యు బుచ్చన యనంగాఁ బేర్చువాని న్వకీ
లు నిజాప్తుం బనిచెం గుమందరుని నాలోకించి కార్యంబు సం
తన గూడం దగురీతిగాఁ బలికి ఫోక్తా సేయు మంచు న్వడిన్.

79


శా.

చాతుర్యోక్తులఁ బంతెనాన్వయమునన్ సర్వంకషప్రౌఢిప్ర
ఖ్యాతిం గాంచిన కొండమంత్రిమణికిన్ గారాలపు౦బట్టి వై
సీతారామన వెంకనాహ్వయులకుం జెల్వంపుసైదోడువౌ
నీతో నీ డెవరంచుఁ బుచ్చె నను మున్నే యన్ని మన్నించుచున్.

80


తే.

అనుపమానప్రభావుఁ డజ్జనవరేణ్యుఁ
డనుప మసలక యతనిచే నాజ్ఞ వడసి
అతులితస్వర్ణపల్లకీకాధిరూఢ
గాఢసామాజ్యరమ నేలి కదలివచ్చి.

81


ఉ.

ఆపరమప్రగల్భవచనామరదేశికుఁ డౌవలు పె
ద్దాపురిమీఁదుగా నరిగి తత్పురసంస్థితురాజుఁ గాంచి స
ల్లాపము లొక్కకొందడువు లాననచేఁ బచరించి యందుఁ జూ
పోపమి యాత్రలో నెఱిఁగి యూర్పు నిగుడ్చుచు లేచి దిగ్గునన్.

82


చ.

 ఇతనిమనంబు క్రూరత వహించినచొ ప్పెఱిఁగించుచున్న ది
మ్మత మిటువంటి దమ్ముసలిమాన్దొర మానసవృత్తి యట్టిదో
కతిపయవాక్ప్రసంగములఁ గానఁగ నయ్యెడు నంచు సత్వరా
యతగతి నప్పుడే కదలి యాయన లస్కరు చేర నేగుచున్.

83


చ.

కడువడి పిన్నపెద్ద లగుఖానులకు న్నజరు ల్నయించుచుం