పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

61


క.

మూసాబూసీవారిదు
బాసీలక్ష్మణసమాఖ్యఁ బరఁగు నతం డు
ద్భాసితమనస్కుఁడై తా
నాసాహెబుపన్నుగడకు ననుకూలించెన్.

61


శా.

ఆరాజన్యుఁ డొనర్చు దుర్నయవిచారాలాపచేష్టావిధుల్
మేర ల్మీఱుచు నంతకంత ప్రచురోన్మేషక్రియావైఖరీ
రారాజద్గతి నెల్లవారలకుఁ గర్ణాసహ్యతం బర్వె రం
గారాయప్రభుమౌళియు న్వినియెఁ దత్కౌటిల్యవార్తాస్థితుల్.

62


సీ.

ఈరాచబిడ్డని క్రూరకర్మవిచార
       మిదియ నూర్జిత మని యెన్నువారు
పౌరుషశాలి రంగారాయనృపమౌళి
       వెనుకఁ ద్రొక్కం డని యనెడువారు
ఘనులు వీరుం డొరు ల్కలహింపఁ దద్ధరా
       జనులకుఁ ద్రొక్కటం బనెడువారు
జయపరాజయములచందము ల్దెలుప దై
       వాధీన మిది యని యాడువారు

62


తే.

నిర్నిమిత్తవిచార మీదుర్నయంపుఁ
బనులు బలనాశకర మని పల్కువారు
నెవ్వ రె ట్లయ్యెదరొ వీర లిట్టికలత
ననుచుఁ జింతానిమగ్నులై రఖిలజనులు.

63


తే.

అత్తెఱంగునఁ దమలోన నఖిలజనము
లిలఁ గలుగువారు పలువురుఁ బలుదెఱఁగుల
పలుకులవిచారములఁ గుంది కలఁతనొంది
డెందములయందు ఖిన్నతఁ జెంది రంత.

64