పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ద్వి తీ యా శ్వా స ము.

51


చ.

అని పునరుత్తరంబులు దదాత్మకు హర్ష మెలర్ప దూత నో
క్కనిఘను నంచి యంచితవికాసమున న్నిదురించి లేచి ప్రొ
ద్దునఁ జని యాప్తవర్గములతోఁ బొడగాంచి యథేష్టగోష్ఠీవ
ర్తనలఁ దురుష్కనేతకు ముదంబొదవం దగురీతి నుండుచున్.

14


వ.

తనయంతరంగంబునఁ బొడమిన యన్యాయసూచకాసూ
యావిశేషంబునకు నశేషంబునకు ననుకూలంబుగా నస
హ్యజనకంబు లగు నుత్తరంబు లయ్యవనపుంగవునకుం గ
ఱపువాఁడై ప్రసంగవశంబున.

15


ఉ.

భూరితరాభిరమ్యరుచిఁ బొల్పగు మాసరకారులో జమీ
దారులు వెల్మవారు భుజదర్పసమాహృతవైరివీరభూ
విూరమణీమనోరమణమేదురరాజ్యరమాంగనామణీ
వారపరిష్క్రియు ల్గల రవార్యులు బొబ్బిలిపట్టణంబునన్.

16


సీ.

 పాండవేయులభుజాపాండిత్యసామగ్రి
       కార్తికేయుని పరాక్రమసమిష్టి
గంగాతనూభవురంగత్ప్రతాపంబు
       హరుని దోశ్శౌర్యమాహాత్మ్యకలన
విక్రమార్కుని భూరివిక్రమప్రక్రియ
       సంకర్షణుని మహాసాహసంబు
కార్తవీర్యార్జునుకలితబాహాశక్తి
       పరశురాముని యుగ్రపౌరుషంబు


తే.

ప్రమదమున సంగ్రహించి శూరప్రపంచ
కల్పనాకల్పచాతురి గానుపింప
నంచితప్రౌఢిమమున నిర్మించఁబోలు
సలిలభవసూతి బొబ్బిలివెలమదొరల.

17