Jump to content

పుట:2015.373276.Rangaraya-Charitramu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్ర థ మా శ్వా న ము

25


తరనిశితకరవాలధారానిపాతనంబుల నెదురుగాయంబులం
గాయంబులు పదులు జోదులు ధర్మాధర్మప్రకారంబుల
ననుకరించి కొంద ఱీయమరావతిని గూర్చియుఁ బరేతపతి
నికేతనంబు ననుసరించి కొందఱు ప్రవర్తించి రనవుడు, నౌడు
కఱచి శచీజాని యాసంయమిపుంగవుం గనుంగొని యి
ట్లనియె.

85


శా.

భూలోకంబున నెవ్వ రెవ్వరికి నాపోరాట వాటిల్లె త
చ్ఛీలంబుల్ కులముల్ బలాబలములున్ సేనాసముజ్జృంభితా
భీలాటోపవిడంబనంబులు జయాపేక్ష ప్రచారంబు ల
య్యాలంపున్ బరుషత్వముల్ వినుట కయ్యా వేడ్క యౌ నిత్తఱిన్.

86


క.

యీకథ సాకల్యంబుగ
మా కెఱుఁగింపుము కృపాసమగ్రకటాక్ష
ప్రాకటవచోవినోదో
త్సేకము దీపింప మౌనిశేఖర యనుడున్.

87


చ.

చిఱునగ వాననాబ్జమునఁ జె న్నలరన్ మునిచంద్రుఁ డప్పురం
దరునిమనంబు రంజిల సుధామధురద్రవముద్రితంబులన్
నిరుపమగోస్తనీస్తబకనిస్సృతచారుమరందపూరభా
స్వరములు నైన పల్కు లతిసమ్మదలీలఁ దలిర్ప నిట్లనున్.

88


చ.

 కలవు ధరిత్రియందు సరకారు లనేకము లందులో శ్రికా
కుళము కళింగసంజ్ఞత మకుంఠతఁ .........బొ
బ్బిలి యను నొక్కపట్టణ మభీష్టత .......మం