పుట:2015.372978.Andhra-Kavithva.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రకరణము,

రసము దేని నాశ్రయించికొనును ?

169



దృష్టి. దీనినిగూర్చి స్థలాంతరమున విపులముగల జర్చించియే యుంటిని. ప్రస్తుతవిషయమున కుపకరించుటకుఁ దేలిన దేమ నఁగా శాస్త్రమునకుఁ గవిత్వమునకు మొగ మెఱుకయే యనియు, శాస్త్ర నియమములు కవిని భాదింప నేరవనియుఁ గవి నిరంకుశుల డనియునే. అందుచే రసమును తదాత్మకమగు కావ్యమును మానవధరమునకు నంగములగు ధరార్థ కామమోక్షములందు శాస్త్ర సార మనఁదగు ధర్మము నాశ్రయించుకొని యుండవని సిద్ధాంతమగుచున్నది.

రసము అర్థమునాశ్రయింపదు.-

సరే, రసము ధర్షము నాశ్రయింపదు. పోనీ, అర్ధము నేమైన నాశ్రయించునా? అర్థసంపాదనమునకును, రసాను భూతికినిఁ బ్రబలవిరోధము, ధనార్జనపరుఁడగువానికి రసాను భూతి యుండదు. ఒక వేళ కొంచే మేమైన నున్నచో నది ధనార్జనమునకుఁ జేఁటు నాపాదించునేకానీ సాయము జేయఁ జూలదు. “బంగారువంటిగోమటి సంగీతము చేత 'బేరసారము లుడి గెన్” అనుపచ్య మే యీరహస్యమును వేనోళ్లఁ జాటు చున్నది. ధనార్జనమునకును,ధనసంరక్షణమునకును,రసజావమున కును జాలవైపరీత్యమును నిరోధముసుగలవు, ధనార్జనపరునకు ధనసంపాదనమే యొకపరమార్గ మగుచున్నది. అందు సర్వవిధ ములగు భావవి శేషములకుఁ దావు చేకూరిన ధనసంపాదనము నకుఁ జేఁటువచ్చును. "ఈధన మే, ఈధనమే, ఇహపర సాధన మీధనమే” యని పలవరించెడు . కలిపురుషుఁడే ప్రపంచమున ధనార్జనపరునీ రూపమున నవతరించి ప్రస్తుతము భూలోకము 'నంతయు నవిచ్చిన్న ముగ నేలుచున్నాడు. ఇట్టి కలిపురుషు లే