పుట:హంసవింశతి.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బున దేవతాధివాసము
లనువొందఁగఁ గాంచి భక్తి యలమిన మదితోన్. 169

క. డుంఠి గణాధ్యక్షుని శితి
కంఠుని భైరవునిఁ జండికన్ బటు విద్వ
త్కంఠీరవ మపుడు మహా
కుంఠితతాత్పర్యమునను గొలిచి భజించెన్. 170

వ. తదనంతరంబునఁ బంచక్రోశంబునం గల మహాదివ్యలింగంబుల సేవించి యచ్చోటు వాసి తైర్థికజనహితసమ్యగయగు గయకుఁ జని గదాధరుం గొనియాడి ప్రయాగ కరిగి త్రివేణీసంగమంబునం గృతస్నానదానాద్యనుష్ఠానుండై మాధవు నారాధించి సప్తపర్ణపటంబుం గనుంగొని త్రివేణీతీర్థంబులు నించిన కావడిఁ గైకొని పంచక్రోశంబున నొక్కమరకతలింగంబు సంగ్రహించి నిజస్థానగమనోన్ముఖుండై. 171

సీ. కావడిపై నంటఁగట్టిన యొక కావి
శాటి కంబళి యాత్రసంచి యలర
నేతి లడ్డిగ నీళ్ళు నించిన సొఱకాయ
బుఱ్ఱ లిర్వంకలఁ బొసఁగి యుండ
నెగనెత్తి కుఱుచగా బిగియఁగట్టిన పంచె
పై బిగించిన ప్రాఁతబట్ట యొప్ప
ముఖఘర్మములఁ డోసి మునుఁగఁ జుట్టిన పల్లె
కొనలు మారుత లౌల్యమున హరింప
తే. గమనజవమున నఱ్ఱాడు కావడదరి
కిఱ్ఱుకిఱ్ఱని భుజమునఁ గేళి సల్ప
గౌడరుద్రాక్షమాలికల్ కంఠసీమఁ
దనర వచ్చెను వేడ్క నత్తైర్థికుండు. 172