ఈ పుట ఆమోదించబడ్డది
238
సౌగంధిక ప్రసవాపహరణము
యందురు జనులు మాయకీర్తి బాపు
కడిమిచే మాబుద్ధి గాదంటి వేని
యడరు దుష్టచతుష్టయంబును గూడి[1]
పొలియుసేన లటంచుఁ బుల్ల దా విరిచి[2]
యెలమితో జేతికి నిచ్చు నవ్వేళ[3] 840
కర్ణ గాంగేయ సంవాదము
కెరలి కర్ణుండు గాంగేయుని దిక్కు
మరలి పావకు లీల మండి యి ట్లనియె
గంగాతనూభవ కటకటా యిట్టి
వెంగలిపలుకులు వెస పల్కఁదగునె
అందఱికిని దాతవై యున్న యట్టి 845
మందె మేళంబున మము సడ్డఁగొనక
ప్రల్లదంబులు పల్కి, ప్రభువుసన్నిధిని
జెల్లించుకొంటివి చేగాచినాఁడ