పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పంచమాశ్వాసము

259


క.

మురిసినయూరనె కడపటఁ
దిరియుట యది సచ్చు టనుచు ధృతిమాలి పురం
దరుఁ డొకనెపమున దేశాం
తర మరిగెన్ మిత్రు లెల్లఁ దను నవ్వంగన్.

289


వ.

ఇట్లరిగి.

290


ఉ.

అక్కడ నక్కడం గల నయంబుఁ బ్రియంబు సువస్తుజాతముం
జక్కనికాంతల న్రతిరసజ్ఞులఁ జూచుచు నాదరంబుతో
నొక్కొకయూరఁ గర్ణనయనోత్సవలీలల నిచ్చ మెచ్చుచుం
బెక్కుదినంబు లుండెఁ దనపేరు నిజాప్తు లెఱుంగకుండఁగన్.

291


క.

ఒకనాఁడు మధురలోపల
నొకచోద్యం బెఱిఁగి మగిడి యుజ్జయినీభ
ర్తకు విన్నవింతు నని[1] యిం
చుక రవణముతోడ వచ్చెఁ జుట్టలు పొగడన్.

292


ఉ.

వచ్చినవానిఁ జూచి జనవల్లభుఁ డీవు చరించు భూమిలో
నచ్చెరు వేమి గంటి వని యానతి యిచ్చిన నప్పురందరుం
డిచ్చకు వచ్చున ట్లడిగె నీధరణీవరుఁ డంచు నాత్మలో
మెచ్చుచు విన్నవించెఁ బతిమె చ్చొనఁగూడ యథాక్రమంబునన్.

293


సీ.

ఈపురి వెడలి యే నెల్లతీర్థంబులుఁ
        దిరుగుచుఁ గేవారధరణి కేఁగి
మగిడి వచ్చుచు హేమమణిమయప్రాకార
        రమ్యమౌ మధురాపురంబుఁ జూచి
చని యొప్పిదం బెల్లఁ గనుఁగొని రేయొక్క
        ద్విజునింటిపొంత నిద్రించునప్పు


  1. వినిపించెదనని