పుట:సింహాసన ద్వాత్రింశిక (కొరవి గోపరాజు).pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము 141

దావృతుఁ డగు ధనదునిగతి
దేవస్త్రీసహితుఁ డైన దేవేంద్రుక్రియన్. 192

వ. ఇట్లనల్పకాలంబు విశ్రమించుచున్న యెడల ననతిదూర మాకందవనంబున నుండి యొక్కభూసురుండు చనుదెంచి తన్మహోత్సవం బవలోకించుచు భూలోకస్వర్గలోకం బిది గదా యితఁడు గదా మహాభాగ్యవంతుం డని కొనియాడుచు మున్ను దా నధికదారిద్ర్యపీడితుం డగుటం జేసి తన్ను నిందించుకొనుచుఁ దనలోన. 193

క. ధాత్రి దరిద్రుఁడు సభల న
పాత్రుఁడు కడుమ్రుచ్చు మిత్రబాంధవులయెడం
బుత్రకళత్రంబులయెడ
శత్రుం డఁట వాని బ్రదుకు చౌకౌఁ గాదే. 194

క. ఇలలో నెవ్వని కర్థము
గల దాతఁడు మాన్యుఁ డుచితకార్యజ్ఞుఁడు ని
ర్మలుఁడు బలవంతుఁ డార్యుఁడు
కులతిలకుఁడు సభ్యుఁ డధికగుణగణ్యుండున్. 195

మ. అని చింతించి మహీసురుం డొకయుపాయం బాత్మనూహించి ము
న్నొనరం జేసిన చండికాచరణపాదోపాస్తి చాలించి యా
జనపాలాగ్రణిపాలికిం జని మహాసంపత్తి యర్థించి కై
కొన నిం దొప్పు నటంచు వచ్చె మదిఁ గోర్కుల్ తీఁగలై సొఁగఁగన్. 196

వ. అతనిం జూచి యి ట్లని దీవించె. 197

క. “భూయాత్తే సంప ద్దీ
ర్ఘాయు ర్భవతే" యటంచు నాశీర్వాదో
పాయనములతో నృపుఁ గని
డాయం జని నేర్పు చొప్పడరఁగాఁ బలికెన్. 198