పుట:సకలనీతికథానిధానము.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

37


క.

వృక్షముననున్న యేవురు
యక్షులు దమలోన మాటల......
.................
.....యారాజ్యంబు గలుగు నది యెట్లనినన్.

210


సీ.

ఈతడు వోయిన యీనాకవు...
        దగిలించుకొనిపోయి తత్పురమున
సామంతు లొకమత్తసామజంబున కొక్క
        పూదండ యిచ్చి యప్పురము
........................
        కధిపతి చేయు బొమ్మని యక్షు
పట్టణముపొంత నొకశిలాపట్టమునను
        కూరుచుండంగ నాభద్రకుంజ ...
బెట్టుటయు వాఁడు బాలించె పృథివియెల్ల


తే.

అది సహింపక వీఁ డొక్కయాగఁడీఁడు
యవని యేలెదు ననచు సైన్యములతోడఁ
గడిమి మెయివచ్చి పురికి ముట్టడము సేయ
యక్షులను జింతనము సేయ నాక్షణంబ.

211


క.

ఆయక్షవరులు నృపునకు
రాయిడి సేయుటయు నాత్మరణమున నురుమై
పోయి రిల ధాతువాదఁవు[1]
మాయలఁ జెడకున్నయట్టిమనుజులు గలరే.

212


వ.

అని దైవికప్రధానంబైన యితిహాసంబు చెప్పిన విక్రమార్కునకు మెచ్చి ప్రతిదివసంబును ధనంబు గురియు చంద్రకాంతలింగంబు నొసంగి యరిగె. సాహసాంకుఁడునుం బురంబున కరుగుచు నాలింగంబు నొక్కదరిద్రవిప్రున కిచ్చి చనియె. తదనంతరవృత్తాంతంబు వినుమని యిట్లనియె.

213
  1. పోయిరి ధాతుర్వాదఁపు