పుట:సకలనీతికథానిధానము.pdf/300

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

294

సకలనీతికథానిధానము


ఆ.

ద్యూత మాడి వాసితోడుత దా ద్యూత
మాడి గెలిచినట్టియర్థమెల్ల
తనధనంబు చేసి ధనదత్తుఁడను విప్రుఁ
డాత్మసఖుఁడు గాఁగ నాచరింప.

207


సీ.

ఆవిప్రువరుఁ డిట్టు లనియెను శివదత్తు
        డనెడు విప్రునకు నే నాత్మజుఁడను
మాతల్లి కడుబాపమతి ఱిత్త కలహించి
        కోడలి నిలు వెళ్ళఁగొట్టి యేడ్చు
భయమును మాయా సపర్యయు నందక
        కపటంబు లధిపతిఁ గల్లలాడు
బంధువర్గము నెల్ల ప్రతిదినంబును దిట్టు
        నెప్పుడు లేదని యింతి సొలయు


భార్య మారుగాఁగ (చంద్రబ్రతిమ నా[1])
యదియు నీవు వెళ్లుఁడనుచును దూఱు
నందు బడగలేక యరుదెంచి యిచ్చట
నిన్ను గంటి ద్యూతనిధికతాన.

208


వ.

అని నుతించిన.

209


క.

ఆభీమభటుఁడు హితుఁడగు
నాభూసురుఁ గూడి తిఱుగునంతట నదిలో
శాభర్యధిపతి తెచ్చిన
లాభమునకు దాశభటులు లౌల్యము మెఱయన్.

210


గీ.

అట్టిమత్స్యంబు భేదింప నందులోన
శంఖదత్తుని బొడగాంచి సంతసమున
బ్రతికి తెటువలెనన భీమభటున కనియె
మంత్రిపుత్రుఁడు దైవికమహిమఁ జేసి.

211
  1. ప్రతిమయు నా కిచ్చి