పుట:సకలనీతికథానిధానము.pdf/289

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

283


వ.

అక్కనకమంజరి కమాలకరజ్వరనివారణార్థంబు శక్తికి నరోపహారంబు సమర్పించ తనవృత్తాంతం బెఱింగిన యశోక కరియను సఖని బలివట్టందలంచి.

148


గీ.

పట్టి తెచ్చి విభుని పరకంకన్యిట భూ
స్థలిని ఖడ్గమెత్తి తానె నఱుకఁ
జేర మొఱ్ఱ యిడుచు ద్వారపాలకునిల్లు
చొచ్చి చెప్పెఁ దొంటి సుద్దు లెల్ల.

149


ఉ.

చెప్పిన నేమి చెప్ప నృపశేఖరుఁ డాసతి దుష్టశీలగా
నప్పు డెఱింగి హాప్రియ మృగాక్షి! లతాంతశరీర యెట్టుగా
నిప్పుల వ్రేలితే యనుచు నివ్వెరగొందంగ వందిమానవుం
డప్పుడు వచ్చి చింత వలదంచును బుద్ధులు చెప్పి యిట్లనున్.

150


సీ.

హరిపూజ చేత హంసావళి నాశంబు
        బొందదు వెదకించు పువ్వుబోణి
నా నట్ల కావింప నటవీస్థలంబున
        గనికొనియేగి తజ్జనకునింటఁ
బెట్టితిమని నిజభృత్యులు చెప్పిన
        జని మేఘమాలి తత్సదనమునను
హంసావళిని వివాహముఁ బొంది క్రమ్మఱ
        తనపురి కేతెంచె ధరణినాథుఁ


గీ.

డనుచుఁ జెప్ప వినుచు నప్పు డుజ్జయినికి
నరిగి యొక్కముసలియవ్వయింట
రెండురూక లిచ్చి నిండంగ భుజియించి
కుక్కి యిడిన నిద్రఁగూరియుండు.

151


వ.

అప్పుడు.

152