పుట:సకలనీతికథానిధానము.pdf/275

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

269


పద్మంబులకు సరః పఙ్కంబున మునుంగ
        జంబుకి మఱియొండు సామజంబు
గలసి తొల్లిటి కరిఁ గారింపఁనలఁచిన
        నది భద్రకులజాతహస్తి యగుట


మౌనిపంవున బఙ్కనిర్మగ్నమైన
పద్మి వదలించె సుజనుఁ డాపన్నుఁ గాచు
కరణి నట నక్కయునుఁ బోయె గప్పదూటి
కాన యీవట్టిమోహంబుఁ గడవు మదిని.

92


వ.

అని విద్యాధరి యిట్లనియె.

93


సీ.

వామదత్తుండను వసుధామరేంద్రుఁ డా
        హారార్థమై యొక్కయవనిసురుని
నర్థించి భుక్తిగృహంబునఁ గూర్చుండి
        యంతట లేచి గేహంబు వెడలి
క్రమ్మఱవచ్చి భుక్తగ్రాసియై ద్విజుం
        డడిగిన నవ్విధ మతఁడు వలికె
మద్భార్య నిరతము మహితసైరిభపాలు
        మరగిన దనుచు నామర్మమెల్ల


నాకుఁ బినతండ్రి చెప్పిన నమ్మి యేను
పోయిచూచిన వెఱవక పొలఁతి గొట్టె
నంత నెనుపోతనై వాని నడపఁగదియ
గట్టి రిద్దఱి సాలలో గంబమునను.

94


వ.

అప్పుడు.

95