పుట:సకలనీతికథానిధానము.pdf/268

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

262

సకలనీతికథానిధానము


సీ.

విక్రమసింహ పృధ్వీపతి నందన
        సుభగుని నొకరాజసుతునిఁ జూచి
సఖచేతఁ బిలిపించి సంకేతగృహమున
        నతనితో రతికేళి ననుభవించి
జనకుం డుషఃకాలమున వానిచే కూతుఁ
        బెండ్లి చేసెదనని పిలువఁబంపి
గాంధర్వమున మున్నెకలయుట ధాత్రిచే
        నెఱిఁగి మంత్రులకెల్ల నెఱుఁగజేసి


యర్హుఁడని వారు చెప్పిన హర్షమొంది
యాత్మనందన నిచ్చి రాజ్యార్ధ మిచ్చెఁ
గాన దైవికమునఁ బొందగలుగు సదృశ
పతులవిధివ్రాతఁ దప్పునే భామినులకు.

60


సీ.

మఱియు దరిద్రుండు మహిసురుఁ డొక్కఁడు
        ధనవద్ధరాసురుదాసుఁ డగుచు
నావిప్రసుత పెండ్లి కనుకూలదినమున
        సందడి యగుడు నాసందునందు
కన్యక గొనుచుఁ దస్కరమార్గమున రాజ
        గృహము బ్రవేశించి కుహకవృత్తి
నరపతిప్రశ్న కుత్తర మిచ్చి మెచ్చించి
        పృథ్వీసురునిసుతఁ బెండ్లియాడి


భూపకరుణను సంపద్విభూతిఁ దాల్చె
నట్లు గావున పూర్వభాగ్యమునఁ జేసి
తగినవరులను (కలియుట తరుణులకును)
నమ్మకుండినఁ జూతము రమ్ము నృపుల.

61