పుట:సకలనీతికథానిధానము.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సకలనీతికథానిధానము


కవిరాజవిరాజితము.

అడుగర యేవరమైనను నిచ్చెద నర్కనృపాలక యన్న నతం
డడిగె దయాకర భట్టికి నాకు సహస్రసమంబులు తేజమునం
బుడమి భరింపగ నిమ్మని వేడిన భూతగణేశ్వరుఁ డిచ్చిచనెన్
గడుముద మొంది పురంబునకుం జనకల్యముఖంబు దయం బగుడున్.

107


క.

భట్టిఁ బిలిపించి రాత్రి
కట్టడి వినిపించ నతఁడు కడువేడుకతో
నెట్టన వేవత్సరములు
గట్టిగ నిచ్చితి నటంచుఁ గరణన్ బల్కెన్.

108


వ.

పలికి యాక్రమంబుననే యుపాయంబూహించి సంవత్సరంబున పూర్వార్థంబున రాజ్యంబును అపరార్థంబున వనవాసంబునుగా నియమించుకొని రాజ్యంబు సేయుచుండ నొక్కనాఁడు.

109


క.

ఒక్కదిగంబరముని నృపు
చక్కటి కరుదెంచి సాహసప్రియ యిట నే?
నొక్కక్రతు వాచరించెద
నక్కడి కేతెమ్ము మత్సహాయతకొఱకున్.

110


చ.

అనవుడు నట్లకాకయని యమ్మునివెంటను విక్రమార్కభూ
జనపతి యేఁగి యాతఁడు పిశాచమఖక్రియ నాచరింపుచున్
దనుజుని బట్టి చెమ్మన బ్రతాపభయంకరుఁ డట్ల సేయ, న
మ్మనుజభుజుండు మెచ్చి రిపుమర్దనవిక్రము జూచి యిట్లనున్.

111


క.

భూతలనాయక! విను నే
భేతాళుఁడ నీకు నిష్టభృత్యుఁడనై నీ
వేతరి దలఁచిన వచ్చెదఁ
జేతోగతి ననుచు నష్టసిద్ధులు నిచ్చెన్.

112


వ.

అవి యెయ్యవి యనిన.

113