పుట:సకలనీతికథానిధానము.pdf/242

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

236

సకలనీతికథానిధానము


సీ.

రమణీయమగు మధురాపురంబునఁ గాల
        కంటకుండనువాఁడు కాంతయందుఁ
బాయ(నిరతి) చిత్రపటమున రూపంబు
        వ్రాయించి చూచు నేవంకలందు
నంతట నొకసిద్ధుఁ డన్యదేశీయుండు
        చిత్రితకామిని చెలువుఁ జూచి
వ్యభిచారి యిది పిన్నవయసునాఁ డిప్పుడు
        గరితయై యున్న దెక్కడికిఁ జనక


యనిన నక్కాంతచెలి పోయి యంగనకునుఁ
జెప్పె సంతతి కొకమందు సిద్ధుఁ డెఱుఁగు
కాంత పాదంబు చూచి యేకనఁగనేర్చు
ననినఁ దోకొనిరమ్మన్న నతనిఁ గొనుచు.

272


వ.

లోనికిఁ జని తెరయవ్వలం గామిని నునిచి పాదంబు చాఁపుమనిన నది యట్లచేసిన.

273


గీ.

చేతి చిఱుగత్తి నూరువు చించి కాలి
యందె గొనిపోయి యక్కాంతయధిపుతోడ
బోయి నటువంటినిశిప్రేతభూమి చొచ్చి
శవములను దించునాస్థితస్థలికిఁ జేరఁ.

274


వ.

అదలించి శూలంబునం బొడిచి కాలియందియ వుచ్చికొంటిని యిదెయందియ తదూరుదేశంబు ఘాతయుం జూడుఁడనిన నక్కాలకంటకుం డది వీక్షించి దానినడవికిం గొని చని గళంబునఁ బాశంబు దగిలించి పోవుటయును.

275


గీ.

సిద్ధుఁ డచ్చటికినిఁ జేరి రజ్జువు ద్రెంచి
కాంతతో దగలన సంతసించెఁ
గాన కపటసతుల గపటంబుతోడన
బొందు సేయకున్నఁ బొందరాదు.

276