పుట:సకలనీతికథానిధానము.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

147


వ.

ఈనూతం జిక్కినస్వర్ణకారుండు పాపిష్ఠి వీని వెడలం దివియకుమని బుద్ధి చెప్పి యొకవేళ మమ్ముం జూడ విచ్చేయుఁడని యధేచ్ఛం జనిన నమ్మహీసురుం డప్పుడు.

89


క.

పాపము మర్త్యుం డకటా
కూపము వెడలంగ లేక కూపెట్టడు నీ
కూపము వెడలించెదనని
యాపారుఁడు వెళ్ళదిగిచె నయ్యగసాలిన్.

90


సీ.

అంతట నొక్కనాఁ డవనీసురేంద్రుండు
        వనమున కరుగ నవ్వనచరంబు
తనపూర్వ మెఱిఁగించి దండమర్పణ చేసి
        పుష్పఫలాదుల పూజసేయ
నవి యందికొని విశ్రుడట వోవ నొకపెద్ద
        పులిఁ జూచి భయమునఁ బొందుటయును
వెఱవకుమని తనవృత్తాంత మెఱిఁగించి
        తానొక్క రాజనందనునిఁ జంపి


తే.

దాచినటువంటి సొమ్ము లద్ధరణిసురున
కిచ్చుటయును నొక్కపురమున కేఁగి ద్విజుఁడు
నాఁటియగసాలి చేతికి నమ్మి యియ్య
నృపతిపుత్రకు తొడవుగా నిశ్చయించి.

91


క.

భూపాలపుత్రుఁ జంపిన
పాపాత్ముం డనుచు విప్రుఁ బట్టింపించెన్
క్ష్మాపతియు విప్రవధ కా
జ్ఞాపించెన్ దలవరులునుఁ జనిరట వారున్.

92