పుట:సకలనీతికథానిధానము.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

సకలనీతికథానిధానము


వ.

భాగురాయణుం డక్కుమారుని వెంటనిడుకొని యక్కన్యం బొందినవాఁడు సార్వభౌముం డగునని విన్నవాఁడు గావున రహస్యంబు వెలిఫుచ్చకయుండి యొక్కనాఁడు.

314


క.

ఆరత్నసుందరీపరి
చారఁ గళావతినిఁ దనవిచారంబునకుం
గోరి సహాయముగా గొని
యారమణికి సరవిఁ జెప్పి యనిపిన నదియున్.

315


వ.

రత్నసుందరికడకుం జని యిట్లనియె. మీ పినతల్లికొడుకు మృగాంకవర్మ తండ్రిపంపునం జనుదెంచి భాగురాయణి యింట నున్నాఁడని చెప్పి యామెయనుమతి వడసి తిరిగివచ్చి భాగురాయణి కెఱింగించుటయును.

316


శా.

అమ్మంత్రీశుఁడు రాజమందిరములో హర్మ్యయంబు గట్టించి య
క్కొమ్మం బెట్టి తదీయచర్య వెలికిం గూఢంబుగా జేసి త
తృమ్మంధంబున రత్నసుందరియు హృత్సంతుష్టి బొందంగఁ దా
నమ్మార్గంబు ఘటించె దూతిక రహస్యాచారగా నిచ్చలున్.

317


వ.

వర్తింపుచుండ భాగురాయణి మేనల్లుఁడయిన సోమదత్తుండనువాఁ డంత నొక్కనాఁడు మామకు నీతికథలు వినుపింవుచు నిట్లనియె.

318


ఆ.

కాంచి వైశ్యు డొండు సంచిబియ్యము వట్టి
సరికి నూనె వోయుసతులు గలరె!
యనుచుఁ దిరగ బురిని నతివలు నవ్వుచుఁ
దైలమిడకయున్నఁ దత్ క్షణమున.

319


వ.

నిప్పచ్చకుండను కోమటిభార్య తైలంబు బోసెదనని వానిం బిలిచి పళ్ళెరంబున బియ్యంబు గొల్చికొని తానును నాపళ్ళెరంబుననే నూనె గొలిచి లాభంబు వొందె గావున.

320