అమెరికను సాహిత్యము
రికా రాజ్యములలో నాటి ప్రముఖములయిన చారిత్రక రచన లన్నింటియందును, యూరోపియన్ విద్యా సంప్రదాయము యొక్క ప్రభావము కనిపించును. కారణము అమెరికా యందలి నాటి రచయితలలోను, యువకులయిన పండితులలోను పెక్కురు, యూరపునందు విద్యోపార్జనము చేసియున్న వారయి యుండుటయే. విలియం హిర్లింగు ప్రెస్ కాటు, జాన్ లాద్రోవ్ మాట్లే, ఫ్రాన్సిస్ పార్కు మెను, జార్జి బాన్ క్రాఫ్టు మొదలైన వారి అనంతరియములైన చారిత్రక రచనలలోను యూ రపియన్ విద్యాప్రభావము గోచరించును.
అంతర్యుద్ధము లయిన పిదప స్థానిక వాతావరణమును వర్ణించునట్టి లేక ప్రాంతీయ సాహిత్యము వ్రాయునట్టి రచయితలు వెలువడిరి. వారి రచనలు ప్రజలలో కొందరికి గాఢమైన అభిరుచిని పుట్టించెను. దేశములోని క్రొత్త ప్రాంతములను గురించి వ్రాయబడిన కథానికలు, కావ్యములు, నవలలు ముఖ్యముగా పశ్చిమమునుండి శీఘ్రముగా వెలువడినవి. పశ్చిమమునందలి ఎడ్వర్డు ఎగిల్ట్స్ న్, జాక్విన్ మిల్లరు, బ్రెట్ హార్టె దక్షిణమునందలి జార్జి డబ్ల్యు కేబులు, థామస్ నెల్సన్, పేజి, జోయెల్ చాండ్లెర్, హారిసు, జేమ్సు లేన్ ఎల్లెన్; న్యూ ఇంగ్లండునందలి సారా ఆర్నె జ్యూయెటు, ల్యూసాయమ్ ఆల్ కాటు మేరీ, యిఫ్రీమను ; మధ్య పశ్చిమ దేశము నందలి జేమ్సువిట్, కూంబ్ రిలే మున్నగు రచయిత లీ వర్గమునకు చెందిన వారై యున్నారు.
ఆ శతాబ్ది అంతిమ కాలములో అమెరికను సాహిత్యమునకు ఔన్నత్యము చేకూర్ప సమర్థులయి రాజకీయ ఆర్థిక ధృక్పథములు కలిగిన నవలా రచయితలు కొందరు ఉద్భవించిరి. ఎడ్వర్డు బెల్లమీ, రెబెక్కా హార్డింగు, డేవిసు హెలెన్, హంటి జాక్సను, హెరాల్డు ఫ్రెడరికు, డేవిడ్ రాస్ లాకె మున్నగువారు ఈ కవిబృందమునకు చెందిన వారు. ఈ కవిబృందపు రచనలు బలవత్తరమైన ప్రభావము అప్టన్ సింక్లేరు, ప్రాంక్ నారిసు, థియోడార్ డ్రీజరు వ్రాసిన నవలలపై ప్రసరించెను. హెన్రీజేమ్సు, ఎడిత్ వార్టను అనువారు వ్రాసిన నవల లొకజాతికి చెందినవి. వాటియందు నిశితమైన పాత్ర పరిశీలనము కాననగును. అందుచే నవి సాదరముగ జనులచే పఠింపబడెను.
అంతర్యుద్ధానంతరము వ్యాప్తిచెందిన పత్రికా రంగమున కథానికా రచనకు గిరాకీ ఏర్పడెను. ఇట్టి అవసరమును గురించి కథానికలు రచించినవారు ఓహెన్రీ, రిచర్డ్ హార్డింగ్, డేవిను, ఏంట్రోసు, బియర్సు, బ్రైట్ హర్పే అను కవులై యున్నారు.
పందొమ్మిదవ శతాబ్ది అంత్యకాలమునందును, ఇరువదవ శతాబ్ది ప్రథమ దినములలోను, ప్రముఖ సాహిత్య సంపాదకుడు గాను, నవలారచయితగాను,విలియమ్ డేన్ హొవెల్సు సుప్రసిద్ధి నొందెను.
క్రీ.శ. 1890 సంవత్సర ప్రాంతమున వాస్తవిక వాదులును, ప్రకృతి (తత్త్వ) వాదులునయిన కవులు రచించిన నవలా వాఙ్మయము 20 వ శతాబ్ది ఆరంభమునుండి రచింపబడిన నీరసమును, వాస్తవికతాయుతమును ఐన నవలా రచనకు పూర్వరంగముగ నుపకరించెను. అందు పాత్రల మానసిక వృత్తి పరిశోధనము ఉపలక్షిత మగు చుండును. ఇట్టి సాహిత్యపు తెన్నులు జాన్ డాస్ పాససు, ఎర్స్కిన్ కాల్డ్వెల్లు, విలియమ్ ఫాక్ నర్, జేమ్సు టి ఫారెలు, ఎఫ్ స్కాట్ ఫిడ్జి గెరాల్డ్, ఎర్నెస్బు హెమింగ్ వే, థామస్ వుల్ఫు మున్నగువారి రచనలలో గోచరించును. ఆ కవుల రచనలయందలి పాత్రల మానసిక వృత్తి చిత్రణములు, పాత్రల సంభాషణములు అత్యుత్తమములు. అమెరికను విప్లనమునకు పూర్వమునందే ఆరంభమయిన అమెరికను సాహిత్యమునందలి వ్యాసరచన పందొమ్మిదవ శతాబ్ది ఉత్తరభాగమునందు జాన్ బట్టోసు, జాన్ మ్యూరు అను కవుల రచనల ద్వారమున అభివృద్ధిచెంది ఉన్నతస్థాయిని పొందెను. ఇరువదవ శతాబ్దియందు డొనాల్డుకల్రాసు పిట్టి అను నాతడు వ్యాసరచనమున ఈ రంగములో విశిష్టమైన రచనలు కొనసాగించెను.
జార్జినం తాయనా, విలియం జేమ్సు, జోసియారోయిస్, జాన్ డ్యూయీ మున్న గువారి రచనలు వేదాంతశాఖ యందు అమెరికను సాహిత్యమునకు ఔన్నత్యమును చేకూర్చెను. క్రీ. శ. 1880, 1890 ప్రాంతమున కొన్ని అమెరికను నగరములలో నేర్పడిన దుష్ట రాజకీయ పరిస్థితులపై విప్లవరూపముగా వ్యాపించిన ఒక మూఢమైన వాస్తవికతయే, హేమ్లిన్ గార్లెండు, స్టెఫీన్ క్రేన్ రచనలలోని అల్పవాస్తవికతకును, తరువాత థియోడార్ డ్రీజరు,