పుట:శ్రీ సుందరకాండ.pdf/467

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 58

               157-159
లంక నపుడు నలువంకలు చూచితి,
కాలని తావులు కనబడ వాయెను,
సీతయు కాలి నశించి యుండునని
శోకము సై పగ లేక తపించితి.
               160
అప్పుడు వింటిని అమృతాక్షరములు
చారణులాడెడి సంభాషణములు;
కాలిపోయె లంకాపురి సాంతము
కాలలేదు జనకజ విచిత్రమని.
                 161
సిద్ధ చారణులు చెప్పుకొనెడి శుభ
సూక్తులు విని, మునుచూచిన శకు
నములు తలచి, జానకి నష్టము కా
లేదని యూరడిలితి మానసమున.
                162
మండుచు నున్నది మామకవాలము,
కాక సుంత తాకదు నా మేనికి,
కమ్మని వాసన చిమ్మె తెమ్మెరలు,
తహతహలాడక తనివోయెను హృది.
                 163
ఇష్టార్థములుగ ఎడనెడ తోచిన
దృష్టాంతములు స్మరించుచు, ఫలకా
రణములైన ఋషిగణముల వాక్కులు
సంభావింపుచు సంతోషించితి.
               164
క్రమ్మఱ సీతను కన్ను లార గని,
ఆమె యనుజ్ఞను ఆశీస్సులు గొని,
మిమ్ముల చూచు తమిన్ ప్రయాణమై
ఎగసి, అరిష్ట గిరీంద్రము నెక్కితి.

454