పుట:శ్రీ సుందరకాండ.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 26


                    43
అప్రియ మెఱుగని సుప్రసన్ను, డరి
కుల మర్దనుడు, రఘుకులవర్థనుడు,
అతనికి దూరంబయి నేనిటు బ్రతు
కుటకన్నను చచ్చుటయె శ్రేయమగు.
                    44
అట్లుగా, కిరువురన్నదమ్ములును
శస్త్రాస్త్రములను సన్యసించి, వ
ల్కలము లూని, ఆకులలములు తినుచు
వానప్రస్థ వ్రతులై సురిగిరొ.
                     45
లేక, రాక్షసకులేశుండు, దురా
త్ముండు, రావణుడు, ద్రోహవ్యూహము
పన్ని, రాఘవుల నన్నదమ్ముల ను
పాయముగా మటుమాయము చేసెనొ!
                     46
కాలమిట్టు లొడిగట్ట కష్టములు
కాలమృత్యు సాంగత్యము కోరితి;
దుఃఖ పీడనల దొరలుచు నున్నను,
మృత్యుదేవత సమీపింపదు నను.
                      47
కిల్బిషములు కడిగిన మహాత్ములు, ము
నీంద్రులు ధన్యులు, ఇష్టానిష్ట స
మానాధానములైన మనసులను
వర్తింత్రు, మహాభాగులు వారలు.
                     48
ప్రియమున దుఃఖము పయికొన దెవరిని,
అప్రియమున భయ మలమట పెట్టును,
రెంటినికూడ పరిహరించి నిలుచు
మహనీయులకు నమస్కరించెదను.

220