పుట:శ్రీ సుందరకాండ.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సర్గ 24

                    29-30
పలికితి వప్రియములు పెక్కులయిన,
సై చితిమేమును జాలిని దయతో,
కాని నీ హఠము మానవు, మా చె
ప్పిన హితవాక్కులు విని నడుచుకొనవు.
                    31
ఇతరుల కెవరికి ఈదరాని సా
గరమున కివతలి గట్టిది, ఇక నీ
వున్న అంతిపురి చిన్న చీమ చొఱ
రాని సురక్షిత రాజనిశాంతము.
                    32
రావణుండు తన రాణివాసమున
నిను దాచె మహా నిక్షేపమువలె,
మేము కాపుదల మేల్కొని యుందుము,
ఎత్తుకపోలే డింద్రుం డయినను.
                    33
నీ హితవాదిని నేను మైథిలీ!
చెప్పిన మాటల చొప్పున మెలగుము,
శోక మడచి, అశ్రుల నాపు, మన
ర్థకములు చింతాదైన్యము లెందును.
                     34
త్యజియించుము సంతతదైన్యము, భజి
యింపు, మసురరాజేశ్వరు రావణు
ప్రేయసివై సంప్రీతి సుఖింపుము,
మనసుతీర కామ్యక్రీడల సతి !
                    35
పిఱికిదాన నీ వెఱుగవు, స్త్రీలకు
జవ్వనంబు శాశ్వతము కాదనుచు,
తరుణప్రాయము దాటక మునుపె, య
థాకామసుఖాధానము నెఱపుము,

206