పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/654

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోధ్యాకాండము

583

—: భరద్వాజముని భరతాదుల కాతిథ్యమొసంగుట :—

దశరథనందన! - తపముల మేము
కృశియించి వేల్పుల - నెల్ల భజించి 8250
చేసిన పుణ్యముల్ - చేఁ జేతవచ్చి
వాసిగా తమ భాగ్య - వశమునం జేసి
యిట్టిమేనులు దాల్చి - యే తేరమిమ్ము
నెట్టిపూజలు చేసి - యెన్నిక గాంతు?
ఫత్రంబు పుష్పంబు - ఫలమును తోయ
మాత్రమైన నొసంగి - మదిఁ బ్రమోదింతు
యెంచి రేపటికి మా - యింట విందార
గించి రాముని పాలి - కని మఱిపొండు."
అనిన "నోస్వామి! మీ - రర్చ లిచ్చితిరి
మనసురంజిల నాశ్ర - మము లోనెఁగలుగు 8260
కందమూల ఫలాది - కంబులె చాలు
విందని యందుపై - వేరె యేమిటికి?"
అనిన "మాకునభీష్ట - మైన యర్థంబు
కొనసాగఁ జేయక - కుఱుచ సేయుదురె?
సేనల నేలయుం - చితి నొక్కయెడను
మౌనుల మే మస - మర్థులమగుచు
నిందరికిని వండి - యిడఁ జాలఁడనుచు?
నందుచే కడ నుంతు - రయ్య మీవారి
రప్పింపు” మనిన భ - రద్వాజుఁ జూచి
అప్పుడు భరతుఁ డి - ట్లనియెఁ గొంకుచును. 8270