పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/563

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

492

శ్రీరామాయణము

నాకథా వృత్తాంత మ - ప్పుడిట్లనియె.
“రమణి! నీపువు ప్రసన్ను - రాలవు గమ్ము
శమియింపు నాతప్పు - సయిరించి మదిని
నెల్లరకునుఁ జాల - హితముగా మెలఁగు
చల్లని మాటల - సాధ్వివి నీవు 6040
నాకు నప్రియముగా - నడతు వే యెల్ల
లోకంబులందుల - లోలనేత్రులకు
వల్లభుం డెటువంటి - వాఁడైన నతఁడె
తల్లియుఁ దండ్రియు - దైవంబు సుమ్ము
యేనన నేల? నీవె - ఱుఁగవే సతుల
కైన శాస్త్రార్థంబు - లఖిల ధర్మములు
కడలేని శోకసా - గరములో మునిఁగి
యడ లెడు నాతోడ - నప్రియంబులుగ
యేమైన ననరాకు - మికమీఁద నన్ను
నేమి సాధించెద - వీవని పలుక" 6050
విభుని దైన్యోక్తులు - విని మేనువణఁక
సభయయై చేరికౌ - సల్య నాయకుని
కేలుఁదమ్ములు రెండు - కెంగేలనెత్తి
చాల శోకమున మ - స్తకముపై నునిచి క
నుఁదమ్ములఁ జేర్చి - గండ పాళికల
నునిచి పేరెదనంట - నొ త్తి యిట్లనియె.

—: కౌసల్యభర్త నూరడించి మన్నింపుమని వేడుకొనుట :—


"ఓ దేవ! మ్రొక్కెద - నోర్చి కొమ్మిటుల
నీదు చిత్తంబున - నిలుపుదురయ్య