పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/553

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

482

శ్రీరామాయణము

ముచ్చటయయ్యె న - మ్మువ్వురు నిన్ను
బనుపుచో నే - మేమి పలికిరి వార
లనుమన్నయవి యల్ల - ననుము నాతోడ
విని యూరడిల్లెద - వినుపింపు మీవు
అనఘఁడైనట్టి య - యాతి భూవరుఁడు
హితులైన యట్టి దౌ - హిత్రుల వలన
వెతఁదీరి యున్నట్టి - విధమున నేను 5800
మానస శోకంబు - మానెద"నన్న
మానవేంద్రునితో సు - మంత్రుఁ డిట్లనియె.
“అనఘాత్మ! మీసేమ - మడిగి సాష్టాంగ
మొనరించితి నటంచు - నొగిఁ బల్కుమనియె.
తనమారుగాఁగ నం - దరు తల్లులకును
వినతి చేసితినని - వినుపింపు మనియె.
జానకీజాని కౌ - సల్యతో మిమ్ము
తానుపోషింప నెం - తయుఁ దెల్పుమనియె.
అదిగాక యగ్నిహో - త్రాది కర్మములు
వదలక మిముఁ - జూచు వైఖరిభరతు 5810
పట్టున నేవేళ - భయభక్తు లునిచి
యెట్టిచో కైకకు - హితముగా మెలఁగి
సవతులపట్టునఁ - జాలప్రియంబు
దవులంగ నడచి బాం - ధవుల నేమఱక
పాలింపుమని రఘు - పతి తల్లితోడ
మేలెంచి ననుదెల్పు - మీ” యనిపల్కె.
భరతునితోడ - "మీ పనుపుననెల్ల
ధరణియుం బాలించి - తండ్రి నేమఱక