పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అయోధ్యాకాండము

249

—: దశరథుఁడు ప్రజలతో రామాభిషేక విషయము ముచ్చటించుట :—


"మారఘువంశక్ష - మానాథులెల్ల
ధారుణి జనులను - తనయుల యట్ల 140
యరసి రక్షించుట - లందఱు మీరు
నెఱిఁగి యుండురె కదా - యీ రాజ్యమునకు
సంతోషమగు నట్టి - జాడ యేనొకటి
చింతించుటనుఁ జేసి - చెప్పెద మీకు
మాపెద్దలనుఁ బోలి - మహికెల్ల మేలు
ప్రాపింప నేకాత - పత్రంబుఁగాఁగ
నేఁటి పర్యంతంబు - నిశ్శంక భుజబ
లాటోపమున నేలి - యభినుతుల్ గంటి
నరువది వేలేఁడు - లయ్యెను మేని
మురువెల్లఁ బొలివోయె - ముదిసిన కతన 150
నూరట వలచెద - నుల్లంబు లోన
మారామచంద్రు బ్రా - హ్మణ ముఖ్యజనుల
సమ్మతి నిఖిలరా - జ్యమునకుఁబట్ట
మిమ్మెయిం గట్టి నే - నీక్షించువాఁడ
నను మీఱినట్టి యు - న్నత గుణారాము
మనువంశనిధిఁ చంద్ర - మండలవదను
సకలలోకము లేలఁ - జాలెడువాని
సకళకళాపూర్ణ - చంద్రుఁడౌ రాము
యువరాజుఁ జేసెద - నొప్పిదం బనుచు
నవనీ జనులు మీరు - నాడితిరేని 160