శ్రీ
కా మే శ్వ ర్యై న మః
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
పూ ర్వ పీ ఠిక
శ్రీ
నాధాబ్జభవాదు లెవ్వని మృదు శ్రీపాద పంకేరుహ ధ్యానానందరసాబ్ధిఁదేలి కృతకృత్యత్వంబుఁ బ్రాపించుచుం;
ద్రా నీహార నగాత్మజా ప్రియుఁడు నిత్యానందుఁ డారోగ్య వి
జ్ఞానశ్రీలిడి చంద్రశేఖరుఁడు విశ్వంబెల్ల రక్షించుతన్ 1
సీ॥ అబ్జాతనయనుని యత్త వారిల్లైన
కలశ పాథోరాశి గర్భమందు
వజ్రమౌక్తిక పంక్తి పడవని పరుపులై
తేజరిల్లెడు మణి ద్వీపమందు
రవిరశ్మి నింత చొరంగనీని కదంబ
తరురాజ వనము మధ్యంబునందుఁ
బ్రావాతసూర్య ప్రపాదాసమానమౌ
చింతామణీ భద్ర సింహపీరి
గీ|| ద్రిదిశకోటీ కిరీట సందీప్త రత్న
రాజి నీరాణిత పదాజ్ఞయై జగంబుఁ
బాలన మొనర్చు మాయమ్మఁ బ్రస్తుతింతు
రమ్య గుణధన్య శైలాధి రాజకన్య.2
సీ॥ పుంజీభవించి యుప్పొంగి శైలములు శృం
గములెత్తి దివిని బ్రాకంగఁజనిన,
రంగదుత్తుంగ తరంగ సంఘములతో
నీరధి కలఁగి ఘోర్ణిల్లుచున్న ,
హోమకుండముల సహోరాత్రముల నూర్ధ్వ
శిఖల నగ్ని తపంబు సేయుచున్నఁ
గులశైలములు పెల్లగిలఁ బ్రభంజనుఁడు జృం
భించి భీకరధాటి వీచుచున్న
గీ॥ శబ్దగుణరూఢి నవ్యయ సరణి నభము
విష్ణుపదమై తనర్చిన, వీసమైన
నేజనని శక్తిమాహాత్మ్యమెఱుఁగ; వట్టి
భవుని కొమ్మను మాయమ్మఁ బ్రస్తుతింతు.3
సీ॥ ఏమహామహుఁడు సంస్కృతపాండితిని గొప్ప
పర్వతంబని నుతుల్ వడయఁ గలిగె
నేఘనుం డాంధ్రమందెల్లపండితులచే
దిగ్ధంతియనుచుఁ గీర్తింపఁబడియె
నేసద్గుణార్ణవుండెల్లెడఁ దర్కసిం
హుఁడటంచుఁ బెనుకీర్తినొందఁ గలిగె
నేకళావిదుఁడు వైయాకరణుల నిట్టి
ఘనుఁడు లేఁడనుచు విఖ్యాతిఁ గాంచె