పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

50

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


    మండల రాజ్యంబు నృపా
    లుండలునకు నప్పగించెఁ గడు భక్తి మెయిన్.206
    
గీ॥ చతు రనంత బలంబులు సందడింప
   సింధు గంగానదుల మధ్య సీమలందుఁ
   జైత్రయాత్రా పరంపరల్ సలిపి దిగ్వి
   జయము సాగించె నక్బరు చక్రవర్తి! 207
   
చిత్తూరు - మూడవ ముట్టడి.

గీ॥ భరతఖండైక భాగ్యమై పరగు రాజ
   పుత్ర రాజ్య మేలని వాని పొడవు వృధయె”
   యని నడిపె సేన తద్భార మాగలేక
   యురగనాయకు ఫణము లుఱ్ఱూతలూఁగె.208
   
గీ॥ మహితధైర్యుండు తోడరమల్లు మేరు
    శిఖరమట్టి ఖాసింఖాను; సింహ మట్టి
    బిరుదుఁ 'ఖాన్ ఖానను' పిడుగుల్ వ్రేళ్ల నలుపు
    భయద శౌర్యులు నడిచి రక్బరును గొలిచి.209
    
మ॥ అలఘుప్రాభవ కీర్తివిక్రమ యుతుండౌ మానసింహుండు, కొం
    డలఁ బిండిన్ బడఁగొట్టు మేటి భగవాన్ దాసిందు నందున్న యో
    ధులకు వృద్ధపితామహుం డిరువురున్ దోతెంచి; రీతండ్రి
    డ్కులు దర్పించిన నడ్డుపాటు గలదె క్షోణితలం బందునన్. 210
    
క॥ ఈమెయి నక్బరు నడుపు చ
   మూమానం బింతయనఁగ బుద్ధిఁ జొరదు; బు
   స్సా మొదలుగఁ బాండోలీ
   సీమ వరకుఁ బదియుమైళ్ళు సేనలు నిండెన్.211 211
   
సీ॥ జలధులంతటి సరస్సులు పెక్కులుండెఁ గ్రిం
           దట వనాశానది నడచు చుండెఁ
   దరుగని బహువిధ ధనధాన్య తతు లుండెఁ
           బైరు క్రొత్తగ నెక్కి వచ్చు చుండెఁ
   గోటలేడును జుట్టుకొని దృఢమ్ముగనుండె;
           సప్త మహాద్వార సమితి యుండె,