పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/68

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

31

ప్ర ధ మా శ్వా స ము


.
    జేయఁ దలఁచె యవన మహీ
    నాయకుఁడును ద్రోహబలమునన్ మది నిడుచున్. 112
    
గీ॥ స్వామి పదసీమఁ దెగి నిజప్రాణమైన
   ధారపోయు పవిత్ర హైందవులయందు
   నకటకట! శిలాదుఁడు గాక యన్నముఁ దిను
   నాతఁ డెవఁడు స్వామి ద్రోహమాచరించు. 123
   
గీ॥ కడపటి దినంబు నిరు మొనల్ గలిసి నపుడు
   బలముతో శిలాదుండు బేబరును గలిసె
   నని తుముల మయ్యెఁ బెక్కుఁగాయములు తగిలి
   యవల సంగ్రాముఁ డరిగె సైన్యములు విఱిగె. 124
   
మ॥ కడుఁదీక్ష్ణంపుఁ బిరంగి గుండొకఁడు మోకాలన్ బ్రవేశించె; మం
    డెడు నుగ్రంపుఁ దుపాకిసోఁకి కనులూటిన్ జెందె నెమ్మేనిపైఁ
    బొడమెన్ గాయము లెన్బ దిట్లు రుధిరమ్మున్ జిమ్మి పుష్పించి యుం
    డెడు బంధూక మహీజమున్ దెగడె క్షోణీనేత సంగ్రాముఁడున్. 125
    
మ॥ "చనఁ జిత్తూరికి గెల్పులేక" యని బుస్సాప్రాంత మందుండె; న
     ప్పెను గాయంబులఁ జేసి శక్తిచెడి నిర్వీర్యంబునైదేహ మ
     జ్జన నాధేశ్వరుఁ డొక్క వత్సరమునన్ స్వర్గస్థుఁడయ్యెన్ విక
     ర్తనుఁ డస్తంగతుఁడైన కైవడిఁ బ్రజల్ దైన్యంబునన్ గ్రుంగఁగన్. 126
     
క॥ అరి రాజాంతకుఁడగు బే
     బరు సంగర జయము నొంది ధారత ధరణీ
     శ్వరులకును రాజరాజయి
     పరిపాలింపన్ దొడంగె వసుధా తలమున్.127

చ॥ ఒకసమయంబు నందు హుమయూనును వ్యాధియు సోకి యంత కం
    తకుఁ జెలరేఁగె' బేబరును “నన్గొని నాసుతుఁగావు దేవ" యం
    చకుటిల బుద్ధి వేఁడుకొనె నట్టులె వ్యాధియు వాని సోఁకి పు
    త్రకుఁడును వ్యాధిఁ బాసె. నొకరాతిరి ప్రాణము వాసె బేబరున్ .128