ప్ర ధ మా శ్వా స ము
29
-: సంగ్రామ సింహునితో - బేబరు యుద్ధము. :-
మ॥ అరులన్ గెల్చుచు సార్వభౌముఁడయి రాజ్యంబేలి సంగ్రామ భూ
వరు సంగ్రామ తలంబునన్ గెలిచి మేవాడ్దేశము జేకొనెన్
ద్వరమై నుగమృగేంద్ర వీర్యులగు యోధ శ్రేష్ఠులున్ గొల్వఁగా
నరిగెన్ బేబరు' సూర్యవంశమణి యుద్ధాయత్తుఁ డయ్యెన్ వడిన్. 115
సీ॥ డోంగరీకుఁడు బలోత్తుంగుం డుదయసింగు
రత్నసింహుడు సలుంధ్రావిభుండు
రణమల్ల నృపుఁడు మార్వారు నాయకమౌళి
మేత్రావిభుండగు క్షేత్రసింగు
ఝాలానృపాలుఁ డుజ్జయసింగు, సోనెగు
ఱ్ఱమహీంద్రుఁడైన యారామదాసుఁ
డల ప్రమరుండు గోకులదాసు చంద్రభా
నుండు మాణిక్య చంద్రుఁడు శిలాదుఁ
గీ॥ డును, హుసేని బ్రహీం సాహితనయుఁ డొకఁడు
స్వామి సంగ్రామసింహు వెంబడిని బోరి
చచ్చుటో గెల్చుటో వేఱుజాడలే ద
టంచు సేనలతో వచ్చిరని యొనర్ప 116
సీ॥ రెండు వాహినులు కార్తీక శుద్ధ పంచమి
నా బయానా ప్రాంతమందుఁగలివె
రాజ పుత్రస్థాన రాజు లందఱు వెంట
నడువ సంగ్రాముఁ డున్నత పరాక్ర
మము మీఱ యవనసైన్య ముఖాగ్రభాగంబు
చించి చెండాడి శోషిల్లఁ జేసె
బేబరు తనసేన వెనుకకుఁ ద్రిప్పి ద
స్యు శ్రేణి పోటుకాచుకొని నిలిచెఁ
గీ॥ క్రొత్త నేనలఁ చెప్పించుకొనియె నవియుఁ