12
రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర
గీ॥ యతఁడిది యెఱుంగునేని దక్షాధ్వరంబు
రూపుమాయింప వేడలు రుద్రుఁడయి దూకి
జగము సర్వసంహారము సలుపుఁగాని
యోర్వఁడవమానలేశ మాయోధమౌళి.39
క॥ అని వగచుచుఁ దమతమ యా
సనములఁ గూర్చుండి రవల సభయెల్ల మహా
జన నివహముచేఁ గ్రిక్కిరి
నెను బిదప ముహూర్తవేళ చేరఁగ వచ్చె. 40
మ॥ అతిలావణ్య విలాస విభమ సురూపాయత్త దివ్యాంగనా
తతులన్ మెచ్చని లోకమోహినులు కాంతారత్నముల్ నల్వురున్
జతురస్వాంతలు కొల్చివెంటనడువన్ సంయుక్త తారాగణాం
చిత జైవాతృక బింబమో యనఁ బ్రవేశించెన్ సభావేదికన్.41
చ॥ కలకలలాడె నేల్ల సభకప్పుననుండియు వింతయంత్రముల్
జలజల రాల్చెఁ బూలు నృపసత్తములున్ జెలి గారవించి రౌఁ
దలలను వాల్చుచున్ మృగమదంబు పునుంగు జవాది గందముల్
వలపులఁ జల్లె నెల్లెడ సభాసదు లెల్లరు నుల్లసిల్లఁగన్.42
సీ॥ జయచంద్రనృపమౌళి సంయుక్తతోడ ముం
దునకురాఁ బౌరోహితుండు నృపుల
వేఱువేఱుగఁ జూపి వారివారి సమగ్ర
పౌరుష ప్రాభవ వైభవములు
విపులంబుగా నిరూపించి వర్ణనచేనెం
గన్నె యొక్క నినైనఁ గన్నులెత్తి
కనుఁగొనకయే ముందుకై సాగి నృపపీఠ
ములు దాఁటి నడిచే విప్రుండు నవలఁ
గీ॥ గల మహామాత్యులను బంధువులను సైన్య
పతుల నుద్యోగులను జూపేఁబడఁతి ముందు”
కరిగె జయచంద్రుఁ డతిక్రుద్దుఁడగుచు మండి
కొమ మహాద్వారమున కీడ్చుకొనుచుఁ బోయి.43