ప్ర ధ మా శ్వా స ము
87
ఉ॥ కొమ్ములులేని యమ్మహిషకోటులు తొండములేని భద్ర నా
గమ్ములు నాఁగ నొప్పు వనిఁ గల్గిన మత్తమహావరాహ పో
తమ్ముల నాప్రతాపుఁ డతిదారుణ లీలల వీఁటియున్ శరీ
రమ్ములు గాడఁగాఁ బొడివి రాసులు రాసులు వోసె నేలపై.392
మ॥ అరుణాంశుచ్చట లీన నేత్రములు శౌర్యాటోప మేపార సు
గ్రరసోద్రేకమునన్ బ్రతాపధరణీకాంతుండు సత్క్షాత్ర సం
భరితుం డెత్తిన యీఁటె దింపక మహామాయాకిరాతుం డటుల్'
నిరతోదగ్ర విహారముల్ నెరపి ఖండించెన్ వరాహమ్ములన్. 393
మ॥ తగుసామంతులు వీరయోధమణులంతన్ వారి దోశ్శక్తికిన్
దగు చందంబున నొక్కమైఁ గసి కాంతారంబునన్ గల్గు నా
మృగసంతానములన్ క్షణంబునను భూమిన్ గూల్చి పెక్కింటిఁ గు
ప్పగఁ దామొక్కెడఁజేర్చి రారుధిరముల్ పాఱంగఁబెన్కాల్వలై. 394
చ॥ అరిజవంబు మీఱ మృగయారతి సాఁగఁగఁజేసి నిల్పి స
త్వరగతి లెక్క సేయఁగఁ బ్రతాపుఁడు గూల్చు వరాహపంక్తి యం
దఱు సమయించు నమ్మృగవితానము మీఱుటఁజూచి హర్షముల్
వఱలఁగ “మంచికాలమిదివచ్చు" నటంచు, దలంచి రందఱున్. 395
మ॥ శివుముత్తైదువ ప్రీతి కేకలములన్ జెండాడి సామంత భూ
ధవులున్ యోధులు నూతనోత్సవ సముద్యత్కాంతులై భూమియున్
దివియున్ గ్రక్కదలంగ నర్చుచుఁ గడున్ దేజంబు దీపింప ను
గ్రవనంబున్ విడి రాజధానినిఁ జొరంగాఁబోయి రొక్కుమ్మడిన్.396
సీ॥ చిత్తూర్పురము శత్రుఁవేఁబడి రాజ భా
గము తద్ద పెద్దదిగాక యున్నఁ
దమదేశ సామంత ధరణీశు లొక్కా రొ
క్కరుపోయి యక్బరుఁ గలియు చున్న
గడలేని యుద్ధసంఘర్షణంబులఁ దమ
దేశమంతయుఁ బిప్పిదేలి యున్నఁ
బరిపంధియో నభోభాగ భూభాగముల్
తలక్రిందు చేసెడి 'బలియుఁడైన