పుట:శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విలాసము.djvu/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

xxxxi


గ్రాసిని ఖండతుండములుగాఁ బడిగూలిన వైరికోట్లకున్
భాసురరంభకుంభ పరి .......... ... ... ...

ఇట్టి ప్రాసములు పెద్దన్న గారి గ్రంథములయందెటనుఁ గనుపడవు.

29.క. ఈసరణిఁగామతంత్రా
      భ్యాస పరిశ్రాంతి మిగులఁ బరవశమైనన్
      [1]నా శిలిధాతుక్షయమై
      మాసములోపలన వాఁడు మరణమునొందున్. జై.భా.

అని ప్రయోగద్వయ మగుపడుచున్నందున వీని కాధారమెయ్యదియని విచారించగా వేములవాడ భీమకవి రచితమగు నీ క్రింది చాటుపద్యము మాత్రమగుపడుచున్నది. ఎద్దియన

30.చ. బిసరుహ గర్బువ్రాఁతయును విష్ణుని చక్రము వజ్రివజ్రమున్
       దెసలను రాముబాణము యుధిష్ఠిరు కోపము మౌనిశాపమున్
       మసకపుఁ బాముకాటును గుమారుని శక్తియుఁ గాలుదండమున్
       బశుపతి కంటిమంటయును బండితవాక్యము రిత్తవోవునే.

అను నీ పద్యము భీమన చెప్పినట్టు తెలియుచున్నది గాఁబట్టి పై చాటువును నాధారము జేసికొని సశలకుఁ బ్రాసమును గల్పించినారు. అయినను నిట్టి ప్రయోగములు భారతాదులయం దగుపడని కారణమును బట్టి దీనిఁ బ్రశస్తమైన ప్రయోగమని జెప్పుటకు సంకోచించుచున్నాము.

  (26) ఈ గ్రంథమున 684-778 పద్యములు ప్రాసభేదమని వ్రాయఁబడియున్నవి. క్రారవట్రువ సుడులకుఁ బ్రాసము భారతాదులయం దగుపడుచున్నది.

31. ఉ. క్షత్రియవంశులై ధరణిఁ గావఁగఁ బుట్టినవారు బ్రాహ్మణ
         క్షత్రియ వైశ్య శూద్రులనఁగాఁ దగు నాలుగు జాతుల న్స్వచా
         రిత్రము దప్పకుండఁగ బరీక్షితు కాచినయట్లు రామమాం
         ధాతృరఘుక్షితీశులు ముదంబునఁ గాచిరె యేయుగంబునన్.

  1. *నాసిలియనినను సాధువే.