పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

శ్రీ దేవీ భాగవతము

 
తే.గీ. ప్రకటితంబుగ మన్వంతరముల నెల్ల ద్వాపర ద్వాపరంబున ధర్మవేది
    యైన వ్యాసుండు దాఁ బురాణాగమములఁ | జెలఁగుచు యథావిధిగ జేర్చిఁ చెప్పుచుండు. 51

క. ప్రతి ద్వాపరమున విష్ణుం డతులమతి న్వ్యాసరూపుఁడై పుణ్యములౌ
    శ్రుతులం బహు విధములఁ దా | న తికించు న్లోకమునకు నతిహిత మొదవన్ ||52

క. కలియుగమున నల్పాయువు | గలవారలు నల్పమతులుగద మనుజు లటం
    చలపడి పురాణసంహిత | లలరించు న్మేలెఱింగి యమిపతి కరుణన్ || 53

తే.గీ. పడతులకు శూద్రులకు ద్విజ బంధువులకు , వేదములు దూరములు కాన వెలయు వారి
    క్షేమమునకుఁ బురాణము ల్చెప్ప బడియె | వ్యాసమునిచేతఁ గరుణామయూత్ముచేత ||54

తే.గీ. సప్తమంబైన యీ వివస్వత్తనూజ | మనువు కాలంబునం దిర్వదెనిమిదవది
    ద్వాపరము ప్రాప్తమాయెనో తపసులార ! యుర్వి సత్యవతీసూనుఁ డుదితుడాయె ||55

ఉ. నాకు గురుండు ధర్మకలసంబు లెఱుంగు మహామహుండు లో
    కైక హితుండు వ్యాసుఁ డిపు డారయ ద్వాపరసంఖ్యవాఁడు మున్
    శ్రీకరు లిర్వదేడుగురు చెల్లిరి ముప్పది కొండు తక్కువౌ
    ప్రాకటసంఖ్యవాఁ డగుచు ద్రౌణి యిఁకం బొడమున్ ధరాస్థలిన్.56

ఉ. నావుఁడు మౌను లో మునిజనప్రవరా! మును ద్వాపరంబులన్
    వావిలి సత్పురాణముల వక్తలుగా నలరారి భూమి ను
    ద్భావము పొందినట్టిరగు వ్యాసులఁ జెప్పు మటన్న సూతుఁడో
    పావనులార | మీ చెవుల పండువుగా వినుఁడంచు నిట్లనున్ ||57

సీ. మొదటి ద్వాపరఘుది మొనసి స్వయంభువు సరవి రెండవది ప్రజాపతియును
    మూఁడవ దుశసుండు మొగి నాల్గవది బృహస్పతి యైదవది యెన్న సవిత యాఱ
    వది మృత్యు వేడవయది మఘవుం డెన్మిదవది వసిష్టుండు తనరఁ దొమ్మి
    దవది సారస్వతుం డవలను బదియవయది త్రిధాముఁడు మరి పదునొకొండ

తే.గీ. వదియ త్రివృషుండు పండ్రెండవది తలంప | బొరి భరద్వాజుఁడునుఁ బదిమూఁడవయది
    యంతరిక్షుండు పదునాల్గువదియు ధర్ముఁడంతఁ బది నేనవదియుఁ ద్రయ్యారుణియును
    నియతిఁ బదునాఱవది ధనంజయుండు నైరి.58

సీ. పదునేడవది ముదం బొదవ మేధాతిధి పదియునెన్మిదవది ప్రతియుఁ బదియు
   తొమ్మిదవది యత్రి తొడి నిర్వదవయది గౌతముఁ డిర్వడొక్కండవయది
   యుత్తముం డిర్వదియును రెండవది వేనుఁ డిర్వదిమూడ్వది యెసఁగ సోముఁ
   డిర్వదినాల్వది తృణబిందుఁ డిర్వదియైదవయది భార్గవాఖ్యుఁ డొప్పు