Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

196

శ్రీ దే వీ భా గ వ త ము


వ. అని యిట్లు విన్నవించుమని బ్రాహ్మణునకుం జెప్పి దక్షిణ యిచ్చి పంపిన నతఁడు
   భారద్వాజాశ్రమంబు ప్రవేశించి సుదర్శనన కేకొంతంబున శశికళాసందేశంబు సెప్పిన
   నతం డలరె . నంత బ్రాహ్మణుందు తిరిగివచ్చి శశికళకావృత్తాంతంబు దెలిపి యింటికిం
   జనియె నపుడు 473

క. శశికళ స్వయంవరమునన్ | గుశలత జూడన్ సుదర్శనుఁడు పూని నిరం
   కుశుఁడగు ముని యానతిగొని | విశదస్థితినున్న తల్లి విని యిట్లనియెన్.474
   
క. కొండికపు నీవు బాసట | యొండుం గనరాదు నీవు నొంటి మనుజరా
   ణ్మండలి నుండఁగలవె నీ | కండయు దండయును నెవ్వరయ్యా తండ్రీ.475

తే.గీ. ఆ యుధాజిత్తు నిను గూల్చ నన్నిగతులఁ |జూచుచున్నాఁడు ని న్నాడఁ జూచెనేని
   ఊఱకుండెడివాఁడు కా డొక్కనిన్నుఁ | గన్నదానను నేను జూడుమన్నయిపుడు.476

తే.గీ. శశికళ నినున్ వరించెనే సమయమిదియె | తనయ నీకిష్ట పెండ్లేల తనువునందు
   బ్రాణములు నిల్చియుండైనా బలుసు కూర | దినియయిన బ్రతుకగవచ్చు వినుము మనుము.
477

వ. అనిన విని సుదర్శనుండు.478

ఉ. రాచకులంబుగాదె నగరా ననుఁ గాంచి స్వయంవరంబు దా
    జూచుటకైన రాడనుచు జూడుము నాదు మగంటిమి భువిన్
    గోచనుగాను గన్నియనుగొం చనుదెంచెద లోకమాత నన్
    బ్రోచెదనంచుఁ గంకణము పూనెను నాకు జయంబు గల్గెడున్.479
    
ఉ. తల్లి భయంబుమానుము యుధాజితు నే నొక లెక్కజేయ నీ
    యల్లము చల్లఁగాఁ బగఱ నోర్చి సుబాహుని కూతుఁ చెచ్చి నే
    నల్లుడనౌదు ముద్దు వగలాడిని గోడలిఁ జేసికొమ్ము నేఁ
    గల్లలువల్క దేవి ననుఁ గాచు సదా కరుణార్ద్రచిత్తయై. 480
    
చ. అని రథమెక్కి యేగునెడ నాత్మజుఁగాంచి మనోరమాఖ్య దీ
    వన లొసగెన్ బదింపదిగ వారక కంటిరె యీ జగంబునన్
    జననినిఁబోలు చుట్టమును శక్తినిపోలిన దైవ మెందునుం
    గనముకదా నిజప్రజ సుఖంబును గోరుచునుందు రెప్పుడున్.481
     
సీ. అగ్రమందును నిన్ను సంబిక రక్షించుఁ బార్వతి వెనుకఁ గాపాడుచుండు
    విషమపథశ్రాంతి విడిపించు వారాహి దుర్గంబులందును దుర్గ ప్రోచు
    గలహమందును నిన్నుఁ గాళిక యప్పరమేశ్వరి దేవి పాలించుచుండు
    మండలంబున నిన్ను మాతంగి గనిపట్టు సత్స్వయంవరమున సౌమ్య మనుచు482