తృ తీ య స్కం ధ ము
177
చ. గృహములఁ గట్టికోఁదలఁచి కృత్యము లెంచి నివాసభూమి ని
ర్వహణము గోర దేవి కృప రాగిల మేదముపూని మేదినిన్
విహితముచేసె భూభృ దటవీ ప్రముఖంబులతోడ నందుఁ దా
రు హితవిలాస విస్తృతి నిరూఢి వసించిరి సంతసంబునన్. 280
ఉ. మానవనాథ! కైటభము మాధవమై తగు మేదమొందుటన్
జానుగ భూమి మేదినియనంబడె ధారణవాచ్యసంగతిన్
బూని ధరాసమాఖ్య నొగిఁ బొందె మహీయముగాగ నెందునున్
దాను మహీమహాభిధఁ గనందగె శేషుఁడు మ్రోయు ధారుణిన్. 281
తే.గీ. ఇనుపసీలలవలె ధరాభృత్తు లలరెఁ | దానజేసికదా ధరాధరములయ్యె
రత్నమయశృంగములు గల్గి రత్నసాను | వచ్చెరువుమీఱఁ గావించెఁ నంబ కృపను.282
వ. మఱియు మరీచియు నారదుండును ఆత్రియుఁ బులస్త్యుండును బులహుండును గ్రతువును
దక్షుండును వసిష్ఠుండును నను వీరు బ్రహ్మకు కొడుకులై పుట్టిరి. మరీచికిం గశ్యపు
డుదయించె, దక్షునకుఁ బదమువ్వురు కూఁతు లుదయించిరి. వారియందుఁ గశ్యపుండు
నిఖిలదేవతలను రాక్షసులను మనుష్య పశు పక్ష్యాదులం గనియె. నిదియ కాశ్యపియను
సృష్టి, పితామహుని యర్థశరీరంబున స్వాయంభువను మనుపు పుట్టె. వామశరీరంబున
శతరూపయను కన్య యుద్భవించె. సయ్యిరువురివలనం బ్రియవ్రతోత్తానపాదులనువారు...
సంభవించిరి, మఱియు మువ్వు రతిరమణీయలైన కూఁతులదయించి రిట్టు భగవంతుడైన
త్రిదశ్యజ్యేష్ఠుండు జగన్ని ర్మాణంబు గావించి మేరుశృంగంబునం బ్రహ్మలోకంబు నేర్పరచి
కొని నివసించె, విష్ణుం డెల్లలోకంబుల కుపరిభాగంబున వైకుంఠంబు నిర్మించికొని
కాపురంబు చేయుచుండె. శిపుఁడతిరమ్యంబైన కైలాసంబు మిరవు చేసుకొనియుండె. నానా
రత్నసంశోభితంబైన మేరుశిఖరంబున స్వర్గంబు గావించుకొని యింద్రుండుండె. సముద్ర
మథనంబునం గామధేనువును, నుచ్చైశ్రవంబను సశ్వంబును, నైరావతంబను గజంబును,
రంబాదులగు నప్సరః స్త్రీలను సముత్పాదితంబులు గావించుకొనియె. మరియు నా
సముద్రంబున ధన్వంతరియను వైద్యుండును జంద్రుడును నుదయించిరి. క్రమక్రమంబున
నండజ స్వేదజాదులు పుట్టె. దేవతిర్యఙ్మనుష్యాది భేదంబుల నానావిధంబగు సృష్టి యిది
యకా యెఱుంగుము. ఇట్లు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగదండ నిర్మాణంబు చేసికొని
యథేచ్చం బ్రవర్తించుచుండ నారాయణుండు మహాలక్ష్మింగూడి నిజభువనంబునం
గ్రీడించుచు నొక్కనాఁడు.283
ఆ.వె. పాలవెల్లిఁదలచి పాలవెల్లిని | రతనాలదీవిదలచి మేలగు రత
నాలదీవిలోని నయసత్యగుణ నికు |రుంబ నంబ శ్రీధరుండు దలచె. 284