174
శ్రీ దే వీ భా గ వ త ము
క. సంపుష్టులైన యసురుల । పెంపుంగని హరిహయుండు పెదవిఁ గణచి ని
ష్కంపనవృత్తిం మదిఁ గో । పంపడి పవిఁ దచ్చిరములు పగులఁగనేశన్. 254
క. ధరణిఁ గ్రియావై గుణ్యం । బరయం గారణము దీని కది యట్లుండన్
నరవర మును బాంచాలుఁడు । వరపుత్రునిఁ బడయుటకు నవన మొనరించెన్. 255
వ. అట్లుచేసిన యజ్ఞంబువలన దృష్టద్యుమ్నుండను కుమారుండును వేదీ మధ్యంబున ద్రౌపది
యుం బొడమిరి, మరియు దశరథుండు పుత్రార్థియై యిష్టిఁ గావించి రామాదుల నలుపుర
పుత్రులం బడసె. నది కతంబున నెచ్చటం గ్రియాశుద్ధికల దచ్చట ఫలంబు మేలగు.
నెచ్చటఁ గ్రియావైగుణ్యంబు కల దచ్చట ఫలంబు కీడగు. ధర్మపుత్రుండు సత్యవాదియయ్యు
ద్రౌపది పరమసాధ్వియయ్యు భీమార్జునాద్యనుజులు మహాపుణ్యులయ్యు, గుత్సిత ద్రవ్య
యోగంబునం గ్రియావై గుణ్యంబు గలుగుట నొండె, సాభిమానులై చేయుటంబట్టి క్రియా
వైగుణ్యంబు ప్రాప్తించి యొండె నశుభఫలంబులకుం గారణంబయ్యెనని చెప్పి మఱియు 256
సీ. జగతీశ సాత్త్వికమగు యజ్ఞమది దుర్లభముసుమ్ము వైఖానసమును లిట్టి
జన్నం బొనర్తురు సాత్వికంబగు భోజనము నిత్యము నొనర్తు రమితశాంతి
న్యాయార్జితంబు వన్యంబు ఋష్యము సుసంస్కృతమునైభక్త మప్రతిమమందు
మంత్రంబుగలదు యూపములేదు మఱి పురోడాశంబు నిత్యంబు నధికమైన
తే.గీ.శ్రద్ధగలదిది పరికింప సాత్త్వికంబు | రాజసం బిఁక వర్ణింతు రాజులకును
వైశ్యులకు నది సేయంగ వలసినట్టి । యజ్ఞమని చెప్పుదురు జ్ఞానులైనవారు. 257
తే.గీ.రాజసము ద్రవ్యబహుళమై రాజిలెడి సు | సంస్కృతంబులగు దాని సాభిమాన
వృత్తులగు రాజులును వైశ్యు లెలమిజేఁయు । చుందు రిఁకఁ దామసము విను మో మహీశ. 258
చ. మదమునఁ బేర్మిఁ జెంది యభిమానము క్రోధము మెండుగాఁగఁ గ్రూ
రదశల నొప్పి చేయుదురు రాక్షసు లా మఖ మెందునేనియున్
సదమలసాధనక్రియల సాధువులై తగు మోక్షకాము లిం
పొదవఁగ సర్వదా శుభము లుల్లమునం దిడి చేయుచుండ్రొగిన్. 259
వ. మునులు చేయు దేవీయజ్ఞంబు మానవయాగంబని పెద్దలు వక్కాణించెద రది విశేషంబని
తెలియుము. అది సేయు విధం బెట్టిదనినఁ జెప్పెద సావధానంబుగా వినుమని యిట్లనియె. 260
సీ. గుణముల నణఁచి యెక్కుడు శుద్ధిఁ దనరార నింపుగా మనసు శోధింపవలయు
డెందంబు పరిశుద్ధిఁ బొందుటకై బాహ్యకాయంబు పరిశుద్ధిఁ జేయవలయు
యజ్ఞంబుచేయుట కపు డధికారియై యింద్రియార్థము త్యజియింపవలయు
బహుయోజనాయతిన్ బరగు స్తంభములతో నెద మండపంబు నూహింపవలయు