Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృ తీ య స్కం ధ ము

171



క. భయవిహ్వలనుగు కిటిదా | రయమున మువిచాపునకుమ రా గవి యెంతే
    దయదై వారెడి శబ్దము | నయముగ వాగ్బీజమును ఘనంబుగఁ బలికెన్.230 230

క. ఇది యిట్టిదనుచు నెఱుఁగఁడు। మదిలోఁ గరుణార్ద్రుఁడగుచు మఱిమఱిఁ బలికెన్
     విదితమది దైవయోగము | రొద దుఃఖావేశమున్న రూఢిగ నొదవెన్.231

ఆ.వె. పంది వచ్చి యిట్లు బ్రాహ్మణుఁడున్నట్టి | యెడను గుబురుగొన్న యీరమందు
    నిఱపుజేసి మఱుఁగె నెఱుకవాఁడును దాని | వెదకికొనుచు వచ్చె వేగ నటకు.232

ఆ.వె. కుశల చాపమీఁదఁ గూర్చుండియున్నట్టి | మునినిఁ జూచి యెఱుక మ్రొక్కి పలికె
    పంది యేడఁబోయె బాపనయ్యా ! నీవు | బద్దులాడవను పసిద్ధి గద్దు. 233233

ఉత్సాహ.
   మంచి బాపనయ్యవయ్య మాకుఁ దిండిఁ బెట్టుమీ
   పంచ నేడ దాగియుండేఁ బందిపిల్ల జెప్పు పో
   షించలేను గాపురంబు చివ్వలెక్కి మైకము త
   ప్పించుకొన్నదయ్య నన్ను బిచ్చగానిఁ బ్రోవుమీ. 234

విచిత్రమానిని
   గంపెడు పిల్లలు కావలె మూఁడుమెకా లొకనాటికిఁ గాపురమా
   కొంపకుఁబోయిన గొళ్ళనిపిల్లలు కూటికి నేడ్తురు కోపముతో
   సంపును బెండ్లము నడఁచఁగ లేనిఁక నాకలిఁ దీర్పుము బాపఁడి మ
   న్నింపుము మా కుల మిట్టిది యీశ్వరుఁ డిట్టుగ మా బ్రతు కేర్పరచెన్. 235

ఆ.వె. అనిన యెఱుక దైన్య మాలించి విప్రుండు । మనము కడువిచారమగ్నమైన
  దలఁచె నిట్టు లయయొ తథ్యంబు సెప్పెద । ననిన హింససేయు టది ఘటించు.236

ఆ.వె. పందిఁ జంపినట్టి పాపంబయేనియు । బద్దులాడినట్టి పాపమేని
   వ్రాసె రెంట నొకటి యేసదుపాయంబుఁ । జేసి యిపుడు దొసఁగు సెందకుందు. 237

క. కిరికిని హితంబు సేసిన । నెఱుకకు నహితుండనగుదు నెఱుకకు హితమున్
    బొరి నొనరించితినేనియుఁ । గిరి కహితుఁడ నగుదు నేది కృత్యమొ యెఱుఁగన్ .238

వ. ఇట్లు వితర్కింపుచు బాడబ కుమారుం డేమియుఁ బలుక నేరక యున్నతఱి నంతకుమున్ను
    శరావిద్ధంబై చను కిటింగాంచి దయార్ద్రహృదయుండై పలికిన వాగ్బీజమహిమంబునం
    జేసి దేవి బ్రసన్నయై జ్ఞానంబొసంగినఁ దత్క్షణంబ తొల్లింటి వాల్మీకింబోలెం గవియై
    యా శబరుం జూచి యిట్లనియె. 239

సంస్కృ, శ్లో॥ యా పశ్యతి న సా బ్రూతే యా బ్రూతే సా నపశ్యతి
            అహో వ్యాధ స్వకార్యార్థిన్ కిం పృఛ్చసి పునః పునః