Jump to content

పుట:శ్రీ దేవీ భాగవతము - దాసు శ్రీరాములు.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృ తీ య స్కం ధ ము

169


ఉ. అంతియ చాలునంచుఁ దన యాత్మను బొంగుచు యజ్ఞమంతయున్
    సాంతము చేసి భూసురుల నంపి సుఖంబుగ నింటనుండఁగా
    వింతగ విప్రరాడ్గృహిణి వేవిళులం గడుసొక్కిసొక్కి తా
    నంతకు నంతకుం దెలియనయ్యెను గర్భిణిగా జనాళికిన్.209
    
ఉ. చిట్టుము లోకిరింతలును జీదరయు న్బరకాస ప్రక్క లోఁ
    దట్టులఁ గల్కు నుల్కు వెలిదాళువు మైకము పాలుమాలికల్
    పట్టులు నిద్రసోకు పనిపాటుల కోర్వమి యెన్నియెన్నియో
    చుట్టుకొనెం బయింబయిని సూడిదబుట్టలు విప్రభార్యకున్.210
    
సీ. అబలనే నీవు నే డది నిక్కమే కాని ప్రమదవు కావని పలికె నొకతె
   మందయానవె తథ్యమందుఁ గాని మృగేంద్రమధ్యవుకావని పలికె నొకతె
   చంద్రాస్యవే నీవు సత్యమె కాని బింబఫలోష్టికావని పలికె నొకతె
   గురుకుచవే నీవు తిరమెకాని తరంగవళివి కావనుచును బలికె నొకతె
    
తే.గీ. తోడిచెలియలు తనయొద్దఁ గూడినపుడు| పలువితాలను నవుటాలు పలుకుచుండ
   దేవదత్తుని గృహిణి దా తెల్లబోవు | సిగ్గుపడి తన గర్భంపు చిహ్నములకు. 211
    
క. ఒక్కటై రెండై మూఁడై ప్రకటితముగ నాలుగగుచుఁ బైనైదై యె
   న్నిక నాఱై మఱి యేడై | యింక నెన్మిది తొమ్మిదాయె నింతికిని నెలల్.212

క. ఆరోహిణికిని సమయగు నారోహిణి కపుడు భర్త యాత్మ ముదము పెం
   పారగఁ బుంసవనంబున్ వారక సీమంతమును బ్రవర్తింపించెన్. 213

క. దినమున లగ్నము శుభగతి | నను వొందగఁ పుత్రుఁ డుదయమయ్యె నతనికిన్
   మనమలర జాతకర్మం | బును బుత్త్రాలోకనంబు బొరిఁ బొనరించెన్. 214
   
తే.గీ. పేరిమి నుతథ్యుఁడను పేరు బెట్టిపిలిచె |నెనిమిదవవర్షమున మంచిదినము చూచి
   యతని నుపనీతుఁ గావించి యధ్యయనము | నొనరఁ సెప్పంగ రాదాయె నొక్క ముక్క. 215
   
క. ఓయనినం బోయనె న | టాయవనీసురుని కొమరుఁ డతిమూఢుండై
   వేయాఱువిధములగు గురు నాయాసమెకాని విద్య యంటకపోయెన్. 216
.
తే.గీ. పదియు రెండేండ్లు గడచిన బాలుడయ్యు | సంధ్యలో గేశవా యన జాలఁడాయె
   గొనలుసాగె నతనివార్త జనపదములఁ బట్టణంబుల వ్యర్థుండు బండ యనుచు 217
   
క. కొందరు మూర్ఖుం డనుచున్ | గొందరు జడుఁడనుచు నింద గొలుపుచునుండన్
   నిందకుఁ దాళక ధరణీ |బృందారక సుతుఁడు సనియె విపినంబునకున్. 218