పుట:శ్రీ ఆంధ్రకవితరంగిణి - పదవ సంపుటము.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

8] రా వు రా జ భూ ష ఇుఁ డు 121 ఉత్సా:- అనుచు గగనభాగమునకు నంచ యొగయఁజూచినకా దనుజకన్యకాలలామ తనదు రెండుచేతులకా వినయ మొప్పC బొదుగఁ బట్టి వేనవేలభంగుల క్రా దనర ( బ్రియముఁ జెప్పచును ముదం బెలర్స నిట్లనుకా 8છ65 పభావతీపద్యమ్నుము. ఇట్టి వింకను గలవు -డ్రను హరీక్ష వి చారితము నెంత వ్రాసినను దృప్తికలుగదు. UKంథ విస్తభీతి చే నింతతో విరమించెదను. ക്ഷജക്ഷജ് 214 రా వు రా జ భ్రూ షణుఁ డు ー学・リ冬ー ఆంధ్రపంచకావ్యములలో నొకటిగా సుప్రసిద్ధినొందిన వసుచరి తమును రచించి నయి మహాకవి భట్టుకులజుఁడు ఈతనియుంటిపేరు పబంధాంకమువారు తండ్రి సూరపరాజు తౌత తిమ్మరాజు; ముత్తాత సింగరాజు, ఈకవితల్లజుఁడు హరిశ్చంద్రనలోపాఖ్యానమనుద్వ్యర్థి కావ్యమునుగూడ గచియించెను నరసభూపాలీయమని నామాంతర ముగల కావ్యాలాంకార సంగ్రహమున గూడ నీతఁడే రచియించెనని కొందఱును, ఆగ్రంథకర్త వేఱని కొందఱును జెప్పచున్నారు. కావున ముందుగ నీగంథతయకర్తృత్వమునుగూర్చి విమర్శించుట యావశ్య కమైయున్నది. ఈవిషయమునఁ బండీతులలో న నేకమాఱులు చర్చలు జరిగియున్నవి. గంథములుకూడ బయలు వెడలినవి. నేనేమి చెప్పినను జర్వితచర్వణ మేయగును. అట్లని నేనావిషయమును దలపెట్ట కుండుటయు చి శ్రవు కాఁజాలదు, క్లుప్తమ గా నందు నుగూర్చిచర్చించెదను. ఈమూcడు గంథములయందున గవివృత్తాంతములను తెలుపుపద్యగద్య ములనిట నుదాహరించుచున్నాఁడను. ఇందువలన వివాదవిషయము స్పష్టము "కాcగలదు. (E