పుట:శ్రీవేంకటాచలమాహాత్మ్యము (తఱిగొండ వేంకమాంబ).pdf/252

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

245


సీ.

వసుధ నీశాపంబు వారింపఁగా లేను
        విపులవాత్సల్యంబు విడువలేను
గాన నీపైనుండుకరుణ మహాదుఃఖ
        కరమయ్యెఁ బైశాచగతిని బొంద
లేక నావలెఁ దగ నీకు దుఃఖము గల్గె
        నిరువురకును ఖేద మేకమాయెఁ
గలియుగ మున్నంత కాల మీశాపంబు
        ననుభవించుచునుండు మనసుఁబట్టి


తే.

సరవి నాకాశరాజను జనవిభుండు
తనకు సుతయైనపద్మావతిని ముదమునఁ
బ్రేమ మీరఁగ నా కిచ్చి పెండ్లి సేయు
నపుడు మకుటముగా శీర్షమందు నిలువు.

171


వ.

అట్టికిరీటం బెట్టిదనిన నూఱుబారవులు కనకంబుతోఁ దీర్చి
వెలలేనిజీవమణులఁ దాఁపించియుండు ప్రతిశుక్రవారంబును
దప్పక యమ్ముకుటంబు నాఱుగడియలు శిరంబున ధరింతు
నపుడు మదీయాక్షులం దానందబాష్పంబులు ధరించు
నయ్యాఱుగడియలు నీవు సుఖింపుచుందువుగాక యని
యానతిచ్చిన విని చోళరాజు శాపగ్రస్తుఁడై చనియె. అంత
హరి వల్మీకంబునం బ్రవేశించి గొడ్డటంబడినగాయంబున
కోపంజాలక బృహస్పతిని మనంబునఁ దలంప నాగురుండు
వల్మీకంబుకడకు విచ్చేసినం జూచి దీనవదనుండై హీనస్వరం
బుతోఁ దన కందుజరిగినవృత్తాంతం బంతయుఁ జెప్పి హరి
వెండియు నిట్లనియె.

172